వైఎస్ ఫ్యామిలీలో వివేకా హత్య చిచ్చు తీవ్రం ..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో వివేకా హత్య రేపిన చిచ్చు తీవ్రమైనట్లుగా కనిపిస్తోంది. ఇంత కాలం వైఎస్ ఫ్యామిలీలో ఎవరి పేరూ బయటకు రాలేదు. కానీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తర్వాత అవినాష్ రెడ్డి సహా పలువురు కుటుంబసభ్యుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో అవినాష్ రెడ్డికి మద్దతుగా వైసీపీ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వారితో పాటు జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి కూడా కొత్త ప్రకటనలు ఇస్తున్నారు. అవినాష్ రెడ్డికి మద్దతు ఇస్తూనే.. ఇంకా పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ప్రకటిస్తున్నారు.

వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ ఫ్యామిలీలో మొదటి నుంచి చీలిక వచ్చిందనేది చాలా మంది చెబుతున్న మాట. ఎక్కువ మంది వైఎస్ వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలిచారు. అయితే అవినాష్ రెడ్డి కుటుంబానికి అండగా జగన్ ఉన్నారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు జరుగుతూండటం… మెల్లగా అవినాష్ రెడ్డి పేరు బయటకు వస్తూండటంతో ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వివేకా హత్య కేసు వెనుక అవినాష్ రెడ్డి కాదని.. ఇంకాపెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పడం ద్వారా రవీంధ్రనాధ్ రెడ్డికి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసన్న అభిప్రాయం కల్పించారు. వివేకా హత్య వెనుక ఇంకా ఏదో జరిగిందన్న అభిప్రాయం మాత్రం బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.

ఇప్పటికైతే సీబీఐ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ ద్వారానే విచారణ జరుపుతోంది. ఈ విచారణ అవినాష్ రెడ్డి దగ్గరకు చేరే సరికి ఆ కుటుంబం నుంచి మరింత మంది తెర ముందుకు వచ్చే అవకాశం ఉంది. న్యాయం కోసం పోరాడుతున్న సునీత ఈ విషయంలో సైలెంట్‌గా ఉండే అవకాశాలు లేవు. ఆమె అసలు హంతకులను పట్టించే వరకూ ఆగరు. అదే సమయంలో కమలాపురం ఎమ్మెల్యే కూడా ఆమె వాదనతో ఏకీభవిస్తున్నారు. సాక్ష్యాలు తుడిచేశారని.. దీని వెనుక ఏదో ఉందని అంటున్నారు.

మొత్తంగా చూస్తే వైఎస్ ఫ్యామిలీలో అవినాష్ రెడ్డిని రక్షించాలన్న తాపత్రయంతో ఉన్న ాళ్లు చురుకుగా బయటకు వస్తున్నారు. అలాంటి వారు వైసీపీలో ఉన్నారు. మిగతా వారు… సీబీఐ దర్యాప్తు ను సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఎలా చూసినా ప్రస్తుతం వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉందని .. అది ఏ క్షణమైనా వైఎస్ కుటుంబంలో పేలిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close