అమరావతి రైతులకూ విజయం తథ్యం !

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే వాళ్లని ఖలిస్తాన్ తీవ్రవాదులన్నారు. అమరావతికి భూములిచ్చి మోసపోయి రోడ్డెక్కిన రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారులన్నారు. ఢిల్లీలో ఆందోళనల చేస్తున్న వారిలో రైతులెవ్వరూ లేరు.. ఉన్నది దళారులేనన్నారు. అమరావతి రైతుల్లో రైతులెవ్వరూ లేరు.. పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారన్నారు. అక్కడి రైతులపై కార్లు ఎక్కించి.. కాల్పులు జరిపారు. ఇక్కడి రైతులపై జల ఫిరంగులతో దాడులు చేశారు. అక్కడి రైతులు ముదుకు రాకుండా మేకుల బారికేడ్లు కట్టారు. ఇక్కడి రైతులు గుడికి వెళ్లాలనుకున్నా లాఠీలతో కుళ్లబొడిచారు. అక్కడ పంజాబ్ రైతులే పోరాటం చేస్తున్నారని తేలిగ్గా తీసుకున్నారు. ఇక్కడ భూములిచ్చిన రైతులే ఆందోళన చేస్తున్నారని తీసిపడేశారు.

ఢిల్లీ తరహాలోనే అమరావతిలోనూ వందల మంది రైతులు ప్రాణాలు పోరాటాల్లోనే గాల్లో కలిసిపోయాయి. అక్కడి అమరులైన రైతుల్ని అవమానించినట్లుగానే ఇక్కడ ప్రాణాలు పోయిన రైతుల్ని కూడా అవమానించారు. ఢిల్లీ రైతుల పోరాటానికి అమరావతి రైతుల పోరాటానికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. అమరావతికి భూములిచ్చిన పాపానికి కులం పేరుతో దాడులకు గురయ్యారు. అత్యంత బలహీనవర్గాలకు చెందిన వారే అత్యధిక భూములిచ్చినట్లుగా అధికారిక రికార్డులు ఉన్నా భూములు ఇచ్చారు కాబట్టి వారు ఓ కులానికి చెందినవారనే ముద్ర వేసి దారుణంగా తిట్టారు..కొట్టారు. అన్నీ భరించారు. భరిస్తున్నారు. పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికి ఏడు వందల రోజులు అయింది. పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నిర్బంధం అమలు చేస్తూనే ఉంది.

ఇప్పుడు రైతులకు వారి పోరాటం ద్వారా ప్రజల్లో కదలిక తీసుకు వస్తున్నారు. పాదయాత్రలో మంచి స్పందన వస్తోంది. ఇంత కాలం చూడని కేంద్రం కూడా.. అమరావతికి మద్దతు ప్రకటించింది. హోంమంత్రి అమిత్ షా మద్దతు ప్రకటించడం రైతులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పుడు కేంద్రం కూడా క్షమాపణ చెప్పి మరీ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. అంటే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అంచనా వేసుకోవడం వల్లనే ఇది సాధ్యమయింది. త్వరలో ఈ ప్రజావ్యతిరేకత సెగ ఏపీ ప్రభుత్వానికీ తగలకతప్పదు. అది తథ్యం. అది తగిలిన తర్వాత అమరావతి రైతులకే విజయం లభిస్తుంది. ప్రాంతీయ విభేదాలను అధికారంలో ఉన్న వారు ఎంత రేపే ప్రయత్నం చేసినా రైతుల వైపే న్యాయం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close