మరోసారి ఈటలతో కాంగ్రెస్ లోపాయికారీ రాజకీయం !

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎలాగైనా షాకివ్వాలనుకుంటున్న ఈటల రాజేందర్ ప్రయత్నాలకు కాంగ్రెస్ సాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఏకగ్రీవం కాగా మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లకు చాన్సివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్‌లోని రెండు స్థానాల్లో పోటీ జరుగుతోంది.అక్కడ ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.

అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున స్థానిక ప్రజాప్రతి నిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు ఎవరికైనా మద్దతివ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ నేతగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. కరీంనగర్‌లో తనకు మద్దతివ్వాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఆయనకు ఈటల రాజేందర్ మద్దతు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటల వర్గీయులు.. కాంగ్రె్స్ గకలిసి ఆయను గెలిపించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

అయితే నల్లగొండలో స్వతంత్రులకు మద్దతివ్వడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్‌ జెడ్పీటీసీలే ఉన్నారు. నిర్ణయాన్ని కోమటిరెడ్డికి వదిలేశారు. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము పోటీ చేస్తున్న చోట అయినా.. లేకపోతే ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చి అయినా ఒకటి రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. నిజానికి అన్ని చోట్లా టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎక్కడైనా ఓడిపోయిందటే.. జారిపోతున్న ఆ పార్టీ పట్టుకు నిదర్శనంగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ ఈ సారి ఈటల తరహాలోనే ఆలోచిస్తేంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close