కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు ఈటల మార్క్ షాక్‌లు !

ఈటల రాజేందర్ బీజేపీలో తన వర్గాన్ని పెంచుకునేందుకు ఉద్యమకారులందర్నీ చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన వారిలో ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా తిరుగుతున్న నేతలను బీజేపీ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్వామిగౌడ్ బీజేపీలో చేరగా.. తాజాగా మరో ఉద్యోగ నేత కూడా కాషాయం కండువా కప్పుకోనున్నారు. టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్త్వరలో పార్టీలో చేరనున్నారు. ఉద్యమానికి పునాదులుగా నిలిచిన జేఏసీ నేతలు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఖాళీగా ఉన్నారు.

బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఉద్యోగ జేఏసీ నేత, ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్తో పాటుగా మెడికల్ జేఏసీకి చెందిన కీలక నేతతో కూడా ఈటల చర్చలు జరుగుతున్నారు. వీరితో పాటుగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘం మాజీ నేత పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉద్యమ నేతలను అధికార పార్టీకి దూరం చేస్తే ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదనే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

బీజేపీలో తన వర్గం కూడా బలపడుతుందని ఈటల భావిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్‌పై ఉద్యమకారులు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారు తమకు అవకాశాలు వస్తాయంటే బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యమంలో పాల్గొనని వారు ఇప్పుడు టీఆర్ఎస్‌లో కీలక స్థానాల్లో ఉన్నారు. అది కూడా వారి అసంతృప్తికి ఓ కారణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close