అలాంటి పరామర్శలతో బాధితులకు భరోసా వస్తుందా !?

సొంత జిల్లా ప్రజలు అతలాకుతలమైపోయినా సీఎం జగన్ పట్టించుకోలేని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత రెండు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి, కడపతో పాటు నెల్లూరు జిల్లాలోనూ పర్యటించారు. అయితే జగన్ పర్యటించిన విధానం మాత్రం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆయన పర్యటనకు నాలుగు రోజుల ముందు నుంచి అధికారులు హడావుడి చేశారు. పర్యటించే ప్రాంతాల్లో బాధితుల్ని చాలా దూరం నిలబెట్టి మాట్లాడించారు. బారికేడ్లు ఏర్పాటుచేసి.. బాదితుల్ని కూలిపోయిన ఇంటి మధ్యలో నిలబడి దూరంగా జగన్‌తో మాట్లాడించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కారణంగా కొట్టుకుపోయిన గ్రామాల్లో బాధితుల్ని కూడా సెలక్టివ్‌గా కొంత మందిని మాత్రమే ముందుగా ఎంపిక చేసిన వారిని చుట్టూ ఉంచుకుని చేయాలనుకున్న ప్రకటనలు చేశారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. తిరుపతిలో సీఎం జగన్ పర్యటన సాదాసీదాగా సాగిపోయింది. అక్కడ బాధితుల్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని అనుకున్నారేమో కానీ సగం పర్యటనతోనే సరిపెట్టారు. అధికారులతో సమీక్షచేయాల్సి ఉన్నా… రద్దు చేసుకుని నెల్లూరు వెళ్లిపోయారు.

నెల్లూరులో సీఎం జగన్ పర్యటించిన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఓ వాలంటీన్‌ను కాపలా పెట్టారు. ఎవరూ కనీసం నినాదాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ చోటా బారికేడ్లు అడ్డం పెట్టారు. ఎవరైనా వ్యతిరేక నినాదాలు చేస్తే దానికి పబ్లిసిటీ వస్తుదంన్న కారణంగా .. అనేక మందిని దగ్గరకు కూడా రానివ్వలేదు. చివరికి పర్యటన ముగిసిందని అనిపించారు. నెల్లూరులో మాత్రం వరద ముంపు రాకుండా కొన్ని చర్యలు చేపడతామని రూ.190కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక తిరుపతిలో కానీ.. కడప జిల్లాలో కానీ ప్రత్యేకంగా బాధితులకు ఇంత సాయం చేస్తామని ప్రకటించలేదు.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ప్రజలతో మమేకం అయ్యేవారు. ఎమీ అడ్డంకులు ఉండేవి కావు. సీఎంగా కూడా అలాంటి పరిస్థితిని కొనసాగించాల్సి ఉన్నా… ఆయన మాత్రం.. రిస్ట్రిక్టర్‌గా ఉంటున్నారు. బారికేడ్లతో పర్యటనలు చేస్తున్నారు. దీంతో ముందు ముందు ఆయన జిల్లాల పర్యటనలు కూడా ఇలాగే చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి పర్యటనల వల్ల బాధితుల్లో భరోసారాకపోగా.. ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతుందని వైసీపీ వర్గాలే మథనపడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close