కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకూ అండగా ఉంటోంది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు.. ఇతర కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. పదిహేనో తేదీన ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి చెక్కులను పంపిణీ చేయనున్నారు.

జర్నలిస్టులు అందరికీ ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలంగాణ సర్కార్ కాస్తంత నిజాయితీగానే ఉంటోంది. డెస్క్ జర్నలిస్టులు సహా అందరికీ అక్రిడేషన్లు.. హెల్త్ కార్డులు కూడా ఇచ్చింది. కరోనా బారిన పడిన వారికి తక్షణ సాయం చేసింది. ఈ విషయంలో మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్న అల్లం నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి విడుదల చేయిస్తున్నారు. దీర్ఘ కాలంగా ఉన్న హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కారం గురించే ఎక్కువ మంది మాట్లాడుతూంటారు కానీ ఇతర సంక్షేమం విషయంలో జర్నలిస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ మెరుగ్గా వ్యవహరిస్తోందని చెప్పువచ్చు.

ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇలాంటి సంక్షేమాన్నే ఆశిస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి అక్కడి ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. కరోనాతో చనిపోయిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామన్న జీవో మాత్రం విడుదల చేశారు. కానీ ఇచ్చారో లేదో స్పష్టత లేదు. ఒక వేళ ఇస్తే.. తెలంగాణకు చెంది కూడా అక్కడి ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న అమర్ లాంటి పెద్ద మనుషులు భారీ కార్యక్రమం పెట్టి సీఎంను వేనోళ్ల పొగిడి ఆ చెక్కులు ఇచ్చి ఉండేవారు. అంటే ఇవ్వలేదనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close