కాంగ్రెస్ కూటమిలోకి శివసేన.. పీకేకు చెక్ !

కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పాలనుకున్న ప్రశాంత్ కిషోర్‌కు అక్కడ అడ్డుపుల్లపడింది. దాంతో కాంగ్రెస్‌ను లేకుండా చేసి మమతా బెనర్జీని ఆ ప్లేస్‌లోకి తేవాలని తన ఫిరాయింపుల వ్యూహ రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. అయితే అది ఆయన అనుకున్నంత సులువుగా లేదు. మమతా బెనర్జీతో యూపీఏ ఎక్కడుంది అనిపించినా… కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే ఉండేందుకు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు సుముఖత చూపుతున్నాయి. శివసేన కూడా యూపీలోనే భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకుంది .

ఇప్పటి వరకూ మహారాష్ట్రలో మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని శివసేన చెబుతూ వస్తోంది. ఇప్పుడు జాతీయంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని.. యూపీఏ కూటమిలో భాగమవుతామని ప్రకటించింది. ఇది మమతా బెనర్జీకి మరింత ఇబ్బందికరమే. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు… బీజేపీ వైపు కాకపోతే కాంగ్రెస్ వైపు ఉండాలనుకుంటున్నాయి కానీ మమతా బెనర్జీ వైపు ఉండాలనుకోవడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా మమతా బెనర్జీ కన్నా కాంగ్రెస్ బెటరనుకుంటోంది. బీజేపీ పరిస్థితి దిగజారుతోందని అనిపిస్తే మరిన్ని పార్టీలు కాంగ్రెస్ చెంత చేరే అవకాశం ఉంది.

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలితే తర్వతా రాజకీయాలు పూర్తి స్థాయిలో మారే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్కూటమిలో చేరే పార్టీల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీకే వ్యూహాలు మమతా బెనర్జీని ఒంటరినిచేస్తాయి కానీ.. జాతీయ నేతగా నిలబెట్టలేవన్న అభిప్రాయాలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close