శ్రీనగర్ లో మళ్ళీ ఉగ్రవాదుల దాడి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ లో ఇటీవల కాలంలో తరచూ ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. శనివారం మద్యాహ్నం పాంపోర్ అనే ప్రాంతంలో పాంపోర్ అనే ప్రాంతంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలో ఆనుకొని ఉన్న జమ్మూ కాశ్మీర్ ఎంటర్ ప్రెన్యువర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ భవనం వద్ద కొందరు ఉగ్రవాదులు ఆ దారిన వెళుతున్న సి.ఆర్.పి.ఎఫ్. వాహనంపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ దాడిలో ఒక జవాను అక్కడికక్కడే మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది.

దాడి చేసిన తరువాత ఉగ్రవాదులు పక్కనే ఉన్న ఆ భవనంలోకి పారిపోయి దాక్కొన్నారు. ఆ భవనంలో సుమారు వందమంది విద్యార్ధులు, 50 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన వెంటనే భద్రతాదళాలు అక్కడికి చేరుకొని ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. ఆ భవనంలో ఉన్న విద్యార్ధులు, సిబ్బందిలో చాలా మంది సురక్షితంగా బయటపడ్డారు. లోపల ఇంకా మరికొంత మంది ఉండిపోయారు. శ్రీనగర్ లోని పుల్వామా జిల్లాలోని పాంపోర్ అనే పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close