పాపం వైకాపా నేతలు!

వైకాపా నేతలు నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిని బుజ్జగించి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘తెదేపా తమతో మైండ్ గేమ్స్ ఆడుతోందని, తమ పార్టీ ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోబోతున్నారంటూ తన తోక మీడియా ద్వారా ప్రచారం చేయిస్తూ తమని మానసికంగా దెబ్బ తీయాలని ప్రయత్నోస్తోందని ఆరోపించారు. భూమానాగిరెడ్డి వైకాపాలోనే ఉంటారని’ చెప్పారు.

21మంది తెదేపా ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని ఏ క్షణాన్నయిన ప్రభుత్వాని కూల్చగలనని చెప్పడం ద్వారా ఈ మైండ్ గేమ్స్ మొదట మొదలు పెట్టింది తమ అధినేత జగన్మోహన్ రెడ్డేనని వారికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు చిన్న ఎత్తు వేసి భూమానాగిరెడ్డి ద్వారా వైకాపాకి చిన్న జలక్ ఇవ్వడంతో చిత్తయిపోయి, తెదేపా తమతో మైండ్ గేమ్స్ ఆడుతూ తమని మనోబలం దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపిస్తుంటే అందరూ నవ్వుకొంటున్నారు.

రాజకీయాలలో ఎవరో ఒకరు మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు. అప్పుడు దానిని అవతలి వాళ్ళు ఎదుర్కొని తిరిగి ఎత్తువేసి చిత్తుచేయాలి. ఓటుకి నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించేసి తెలంగాణాలో తెలుగు దేశం పార్టీని శాస్వితంగా భూస్థాపితం చేసేయాలని ప్రయత్నించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు దానికి ఏవిధంగా ప్రతివ్యూహం పన్ని కేసీఆర్ ని నిలువరించారో అందరూ చూసారు.

చంద్రబాబు నాయుడు శక్తిని, తెలివితేటలని తక్కువగా అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న చిలిపి పనికి వైకాపా నేతలు అందరూ మూల్యం చెల్లించవలసి వచ్చింది. వైకాపా నేతలు తమ ఓటమిని, పరాభవాన్ని దిగ మ్రింగుకొంటూ ఆక్రోశిస్తుంటే ప్రజలు అందరూ నవ్వుకొంటున్నారు తప్ప జాలి పడటం లేదు. ఎందుకంటే అది స్వయంకృతాపరాధమే కనుక.

భూమానాగిరెడ్డి వైకాపాలోనే ఉంటారని వైకాపా నేతలు అందరూ చాలా గట్టిగా చెపుతున్నారు. కానీ ఆలయియన్ వ్యక్తి భూమా నాగిరెడ్డి మాత్రం ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి ఆ ముక్క చెప్పడం లేదు. కనీసం ఖండించడం లేదు అంటే దానర్ధం ఏమిటో వైకాపా నేతలే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close