డిసెంబర్ 24.. టాప్ లేచిపోవాల్సిందే: నాని

”డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే” అని వ్యాఖ్యానించాడు నాని. విడుదలకు సిద్దమౌతున్న నాని సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు. డిసెంబర్ 24న విడుదల ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని వరంగల్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్ సినిమా అదే ఆనందం వుంది. రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. కానీ ఈ రోజు నా సినిమాను చూశాను. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది” అని చెప్పుకొచ్చాడు నాని.

”అరేయ్ నాన్న.. నేను నీ ఒక్కడికే ఫ్యాన్ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఉందిరా అని అనేవారు. ఆయనకు ఆ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఆయన చివరి పాట శ్యామ్ సింగ రాయ్ కోసం రాయడంతో ఈ సినిమా మరింత స్పెషల్” అని సిరివెన్నెలనిగుర్తు చేసుకున్నాడు నాని.

”సాయి పల్లవి మంచి డ్యాన్సర్. ఇందులో మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయాను. నిర్మాత వెంకట్ గారితో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. సినిమాలో పనిచేసిన అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే” అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు నాని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్

మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో 12 గంటలపాటు వైన్స్ షాపులు మూసివేయలంటూ ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మే 11 సాయంత్రం...

బెంగ‌ళూరు ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం

ఈ ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభంలో వ‌రుస ఓట‌ముల‌తో నిరుత్సాహ‌ప‌రిచిన బెంగ‌ళూరు, ఇప్పుడు అనూహ్యంగా పుంజుకొంది. వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌లు గెలిచి, ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఆదివారం దిల్లీపై 47 ప‌రుగుల తేడాతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close