బీహార్‌కు ప్రత్యేకహోదా పరిశీలిస్తారట.. మరి ఏపీ సంగతేంది ?

బీహార్‌కు ప్రత్యేకహోదా ప్రకటించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. బీహార్ గత పదేళ్లలో బాగా అభివృద్ధి చెందిన ఇంకా ప్రత్యేకహోదా అవసరమేనని ఆయన అంటున్నారు.ఈ అంశంపై సీరియస్‌గా పరిశీలిస్తున్నామని చెప్పుకచ్చారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను మళ్లీ వినిపించడం ప్రారంభించారు. మూడు రోజుల కిందట ఆయన నీతి ఆయోగ్‌కు లేఖ రాశారు. తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నా… అనుకున్న విధంగా రాష్ట్రం పుంజుకోలేకపోయిందని ప్రత్యేకహోదా ఉంటేనే పుంజుకుంటామని లేఖ రాశారు.

బీహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రకటించడం కలకలం రేపుతోంది. ప్రత్యేకహోదా అనే అంశం ముగిసిపోయిన అధ్యాయమని దేశంలో ఇక ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని స్వయంగా పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని హామీ ఇచ్చినా నెరవేరలేదు. అదే సమయంలో బీహార్‌కు ప్రత్యేకహోదా కోసం పదేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రం బీహార్‌కే కాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదు. వివిధ రకాల కారణాలు చెప్పి.. హోదా అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పటికీ పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం నిర్మోహమాటంగా చెబుతూ ఉంటుంది.

బీహార్‌లో కదిలిన ప్రత్యేకహోదా అంశం ఏపీలోనూ కలకలంరేపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకహోదా అంశాన్ని అడుగుతూనే ఉంటామని చెబుతున్న వైఎస్ఆర్‌సీపీ సర్కార్ .. ఇంత వరకూ ప్లీజ్ ప్లీజ్ అంటూనే ఉందికానీ.. గట్టిగా అడిగే ప్రయత్నంచేయలేదు. కానీ మిత్రపక్షంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నితీష్ ప్రశ్నించడంతో సహజంగానే ఏపీ సీఎం జగన్ పైనా ఒత్తిడి పెరుగుతుంది. అయితే సహజంగా ఆయన ఇలాంటివి పట్టించుకోరు. ఎవరేమన్నా లైట్ తీసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close