చర్చల కోసం టాలీవుడ్ కమిటీ.. ఏపీ సర్కార్ అడిగిందన్న దిల్ రాజు !

ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని దిల్ రాజు చొరవ తీసుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి అపాయింట్‌మంట్ కోరామని.. ఇవ్వగానే వెళ్లి కలుస్తామని చెబుతున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమా వేడుకలో కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత విడిగా ప్రెస్‌మీట్ పెట్టారు. సినిమా వేడుకలో మాట్లాడినప్పుడు నాని తప్పుగా ఏమీ మాట్లాడలేదని.. తప్పుగా అర్థం చేసుకున్నారని వెనకేసుకువచ్చారు. తర్వాత విడిగా ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు మరింత సంయమనంతో వ్యవహరించారు. ఏపీ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు సరిగా తీసుకు వెళ్లలేదని తాము భావిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే మరో సారి కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచుకునే విధంగా జీవో వచ్చినట్టు, త్వరలో ఏపీలోనూ జీవో వస్తుందని ఆశిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడవద్దని ఆయన కోరారు.పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చలు జరపడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ కి ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుందని ‘దిల్’ రాజు, ‘స్రవంతి’ రవికిశోర్ తదితరులు తెలిపారు.

ఛాంబర్ కొంత మంది పేర్లు ఇచ్చిందని, త్వరలో కమిటీ వివరాలను ప్రభుత్వమే వెల్లడిస్తుందని ఆయన తెలిపారు. కమిటీ ఉంటే చర్చలు జరపడానికి సులభతరం అవుతుందని ఆయన అన్నారు. ఏపీ మంత్రి పేర్ని నానితో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశానికి, కమిటీకి సంబంధం లేదన్నారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తుందని, పాత రోజులు వచ్చి అద్భుతంగా ఉంటుందని ‘దిల్’ రాజు ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే దిల్ రాజు సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close