జోరుగా కేసీఆర్ ఫెడరల్ చర్చలు… ప్రగతి భవన్‌కు తేజస్వి యాదవ్ !

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తనదైన ముద్ర వేసేందుకు ప్రగతి భవన్ వేదికగా సైలెంట్‌గా కార్యకలాపాలు చక్క బెడుతున్నారు. తాజగా బీహార్ నుంచి ఆర్జేడీ బృందం వచ్చి ఆయనతో సమావేశం అయింది. లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఇప్పుడు ఆర్జేడీని సమర్థవంతంగా నడుపుతున్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చినంత పని చేశారు. ఇప్పుడు ఆయన ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వీరి చర్చ జాతీయ రాజకీయాల గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

. రెండు రోజుల కిందటే లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు పినరయి విజయన్, సీతారాం ఏచూరీ ప్రగతి భవన్‌కు వచ్చారు. వారితో విందు భేటీ నిర్వహించిన కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణపై చర్చించారు. ఇప్పుడు తేజస్వియాదవ్‌ను కూడా అదే వ్యూహంతో ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. గత నెలలో ఆయన తమిళనాడు వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. గతంలో ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లి పార్టీ నేతలను కలిసేవారు. ఇప్పుడు వారిని ప్రగతి భవన్‌కు ఆహ్వానిస్తున్నారు.

కేసీఆర్‌ జాతీయ స్థాయిలోధర్డ్ ఫ్రంట్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కానీ ఇప్పుడు గుంభనంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాల్లో బలంగా ఉన్న మరికొన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ త్వరలోనే సమావేశం అయ్యే అవకాశం ఉంది. కొంత మందిని ప్రగతి భవన్‌కు ాహ్వానించారని.. మరికొంత మందిని కేసీఆర్ వెళ్లి కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close