కింది స్థాయి కోవర్టుల్ని ఏరేసే ప్రయత్నంలో రేవంత్ !

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏదీ సులువుగా లభించడం లేదు. టీ పీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత ఓ సీక్వెన్స్‌లో పార్టీకి ఊపు తెద్దామనుకున్నారు. రెండు అడుగులు వేసేసరికి.. కేసీఆర్ బీజేపీని అయినా అంగీకరిస్తాను కానీ కాంగ్రెస్‌ను కాదని … రాజకీయం మార్చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కౌంటర్ వ్యూహం అమలు చేయాల్సి ఉంది. దీని కోసం రేవంత్ రెడ్డి ముందుగా … పార్టీలో కోవర్టుల్ని ఏరి వేసే ప్రయత్నం చేస్తున్నారు. పై స్థాయి నేతల విషయంలో ఏం చేయలేకపోతున్నా.. కింది స్థాయి మొత్తం తన చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ దిశగా ప్రక్షాళన సిద్ధం చేస్తున్నారు.

దాదాపు 15 జిల్లాల అధ్యక్షులను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా ఉండటం, అసంతృప్తి నేతలతో అంటకాగడం వంటి వారిపై వేటు వేయనున్నారు. తాను పదవి చేపట్టిన తర్వాత పలు సార్లు అన్ని జిల్లాల అధ్యక్షులకు పార్టీ నే ఫైనల్‌గా పని చేయాలని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కొంతమంది నేతలు వాటిని పట్టించుకోలేదు. అలాంటి వారిని జిల్లా అధ్యక్షుల స్థానం నుంచి మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా గాంధీభవన్‌లో ఒక్కో జిల్లా అధ్యక్షుడితో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తి నేతలు, వారితో జిల్లా అధ్యక్షులకు ఉన్న సంబంధాలపై కూడా రేవంత్రెడ్డి ఆరా తీశారు. పార్టీలో ఆయా సందర్భాల్లో వ్యతిరేకస్వరం వినిపించడం, నేతలపై దాడులు చేయడం, పార్టీ సమావేశాల్లో వ్యతిరేక నినాదాలు చేయడం, రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ తర్వాత ఆ వర్గంతో సయోధ్యగా లేకుండా ఇతర పార్టీల నేతలతో కుమ్మక్కవడం చేసిన నేతల్ని గుర్తించారు. వారిని రేపోమాపో మార్చే అవకాశాలు కనిపిస్తున్ాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close