మీడియా వాచ్ : న్యూస్ చానల్స్‌కు రేటింగ్స్ షురూ !

రిపబ్లిక్ టీవీ చేసిన మ్యానిపులేటింగ్ కారణంగా న్యూస్ చానళ్లకు నిలిచిపోయిన బార్క్ రేటింగ్స్‌ను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో మళ్లీ రేటింగ్స్ ప్రకటించనున్నారు. రేటింగ్స్‌ను మ్యానిపులేట్ చేసిన కారణంగా బార్క్ మాజీ సీఈవో సహా 14 మంది అరెస్ట్ అయ్యారు. 14 నెలల కిందట రేటింగ్స్ ఆగిపోయాయి. తప్పుల్ని సరిదిద్ది మళ్లీ రేటింగ్స్‌ను ప్రారంభించాలని న్యూస్ చానళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం తక్షణమే రేటింగ్స్ పునరుద్ధరించాలని సమాచార, ప్రసార మంతృత్వ శాఖ ఈ రోజు బార్క్ ను ఆదేశించింది.

రేటింగ్ పద్దతిలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత మూడునెలల రేటింగ్స్‌ను కూడా నిజమైన ట్రెండ్ తెలిసేలా నాలుగు వారాల సగటు లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. సాధారణంగా శనివారం నుంచి శుక్రవారం వరకూ లెక్కించిన సమాచారాన్ని ఆ తరువాత వచ్చే గురువారం నాడు విడుదల చేస్తారు. ఆ విధంగా బార్క్ ప్రతి వారం అంతకు ముందు వారం రేటింగ్స్ ఇస్తుంది. ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాలుగువారాల సగటు మాత్రమే ఇవ్వాలి.

లెక్కించిన వారంతో బాటు అంతకు ముందు మూడు వారాల సమాచారాన్ని కూడా కలిపి నాలుగు వారాల సగటు మాత్రమే న్యూస్ చానల్స్ కు బార్క్ వెల్లడిస్తుంది. దీనివలన ట్రెండ్ తెలుస్తుంది. అనారోగ్యకరమైన ధోరణులను కొంత మేరకు అడ్డుకోవటానికి ఇది పనికొస్తుందని భావిస్తున్నారు. న్యూస్ చానల్స్ తోబాటు మ్యూజిక్, మూవీస్, కిడ్స్, స్పిరిచ్యువల్, స్పోర్ట్స్ ఇలా వివిధ కేటగిరీల చానళ్లకు విడిగా రేటింగ్‌లు ప్రకటిస్తారు. వాణిజ్యప్రకటలను ఆకర్షించడంలో ఈ రేటింగ్‌లే టీవీ చానళ్లకు కీలకం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close