యూపీలో బీజేపీ నేతలకూ అఖిలేష్ సూపర్ స్టార్ !

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. సహజంగా గెలిచే పార్టీ దిశగా వలసులు ఉంటాయి. సర్వేల్లో యూపీలో బీజేపీ గెలవబోతోందని గత ఆరు నెలులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. జాతీయ మీడియా పేరుతో.. కొంత మంది అదే పనిగా బాకా ఊదేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు బీజేపీ నేతలకు బాగా తెలిసినట్లుగా ఉన్నాయి. వారు మాత్రం గెలిచే పార్టీగా సమాజ్ వాదీ పార్టీని నిర్ణయించేసుకుని ఆ పార్టీకి క్యూ కడుతున్నారు. మంత్రులు , ఎమ్మెల్యేలు ప్రతి రోజూ సమాద్ వాదీ ఆఫీసుకు వెళ్తున్నారు. అఖిలేష్‌తో కండువా కప్పించుకుంటున్నారు.

ఏడు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో మొత్తం పద్దెనిమిది మంత్రులు ఎస్పీ లో చేరాలని డిసైడయినట్లుగా తెలుస్తోంది. నలభై మంది ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వారి వారి సామాజికవర్గాల్లో పట్టున్న వ్యక్తులే. ఈ కారణంగా బీజేపీ కూడా టెన్షన్ పడుతోంది. గెలిచే పార్టీ అన్న ప్రచారాన్ని వీలైనంత ఎక్కువగా చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రజల్లోనూ.. బీజేపీ నేతల్లోనూ సమాజ్ వాదీ పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో ముందస్తుగా అందరూ సమాజ్ వాదీలోకి చేరుతున్నారు.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్‌గా అఖిలేష్ యాదవ్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అతి పెద్ద రాష్ట్రంలో పార్టీని తెలివిగా నడిపిస్తున్నారు. బీజేపీ ఒత్తిళ్లకు ఎక్కడా తలొగ్గడంలేదు. చిన్న చిన్న పార్టీల్ని కలుపుకుని పోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తన మీద కోపంతో సొంత పార్టీ పెట్టుకున్న బాబాయ్‌ను కూడా ఏ మాత్రం శషబిషలు లేకుండా కలుపుకున్నారు. అఖిలేష్ రాజకీయం బీజేపీ నేతలకు నిద్రపట్టనీయడం లేదు. దీంతో ఉత్తరప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close