‘విరాగాలు’ 4 : కప్పల తక్కెడ!

అధికారం నీడ కొరకు అతిగా వెంపర్లాట
అభివృద్ధి కోసమంటు బయటకు చెప్పే మాట!
నేతల అవకాశవాద విశృంఖల పోకడలకు
ప్రగతి పేర భలే దొరికె బుకాయింపు తూటా!

అధికారం గొడుగు కింద లేకుంటే నిధులీరా?
ప్రతిపక్షం ఉన్నచోట ప్రజలను పగబడతారా?
ఇది నవీన రాజనీతిగ దాపురించిన ఖర్మం
విలువలన్ని భ్రష్టమైన ప్రజాస్వామ్య ధర్మం !!

తెలంగాణలో తెలుగుదేశం వారంతా వెళ్లి తెరాసలో చేరినంత కాలమూ వారిని తిట్టిపోశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి తెదేపాలోకి వలసలు మొదలయ్యాయి. జంపింగ్‌లు చేస్తున్న అందరూ చెబుతున్న మాట మాత్రం ఒక్కటే.

తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే అధికార పార్టీలో చేరుతున్నాం అంటూ ప్రతి ఒక్కరూ ప్రకటిస్తున్నారు. నిజానికి ఇది ప్రభుత్వాలు సిగ్గుపడవలసిన మాట. పై మాటలకు అర్థం ఏమిటి? అధికార పార్టీలో చేరితే తప్ప.. వారి నియోజకవర్గాన్ని ప్రభుత్వం తొక్కేస్తుందన్నమాట. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. అలా చెబుతున్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తాము పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని.. తమ పార్టీ వారికి మాత్రమే నిధులు ఇస్తాం అని అధికార పార్టీ ఒప్పుకుంటున్నట్లే లెక్క. మరి ఇంత దుర్మార్గంగా పార్టీలు ఎందుకు వ్యవహరిస్తున్నాయో.. ప్రజలు ఈ పోకడల్ని ఎలా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాయో తెలియడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close