కేజ్రీవాల్ కి నోటీసులు ఇవ్వాలా వద్దా…

ఒకప్పుడు డిల్లీ మరియు డిస్ట్రిక్ట్ క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడుగా ఉన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, స్టేడియం నిర్మాణం పేరిట భారీగా నిధులను స్వాహా చేసారంటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దానికి ఆగ్రహించిన అరుణ్ జైట్లీ తనపై నిరాధారమయిన ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించారని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ తో బాటు ఆమాద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ చద్ద, దీపక్ బాజ్ పేయిలపై కూడా జైట్లీ దావా వేశారు.

దానిని ఈరోజు విచారణకు స్వీకరించిన డిల్లీ న్యాయస్థానం ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ని ఈ కేసులో విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా కోర్టుకి రమ్మని నోటీసు ఇవ్వాలా వద్దా అనే దానిపై మార్చి 9వ తేదీన తమ నిర్ణయం తెలుపుతామని ప్రకటించింది.

తనపై అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వాగతించారు. జైట్లీపై తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కూడా చెప్పారు కానీ ఆయన ఇంతవరకు తన ఆరోపణలను నిరూపించే ఆధారాలేవీ సమకూర్చుకొన్నట్లు లేదు. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించేందుకు ఆయన ఏక సభ్య కమిటీని నియమించారు కానీ దాని నివేదికలోను అరుణ్ జైట్లీ బోర్డు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా ఎటువంటి ఆధారాలను చూపలేకపోయింది. కనుక అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలని నిరూపించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తప్పనిసరిగా కోర్టుకి తగిన సాక్ష్యాధారాలు నిరూపించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ పరువు నష్టం కేసులో అరుణ్ జైట్లీకి కోటి రూపాయలు చెల్లించుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close