సిద్ధూకు షాకిచ్చిన రాహుల్… చన్నీనే పంజాబ్ సీఎం అభ్యర్థి !

పంజాబ్ సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు రాహుల్ గాంధీ షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. ఇప్పటికే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని.. ప్రకటించేలా చేయాలని సిద్ధూ చాలా రకాలుగా ఒత్తిడి ప్రకటనలు చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ పంజాబ్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని చన్నీనే సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు.

గత ఎన్నికలకు సమయంలోనూ సిద్దూ సీఎం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ పీఠాన్ని దక్కించుకున్నారు. సిద్దూకు మంత్రి పదవి దక్కినా సిద్ధూ తర్వాత టీవీ షోల కోసం రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు. ఇటీవలే మళ్లీ ఆయన యాక్టివ్ అయ్యారు. పంజాబ్ పీసీసీ చీఫ్ అయ్యారు. అయితే ఆయన యాక్టివ్ అయినప్పటి నుండి పంజాబ్ కాంగ్రెస్‌లో రచ్చ ప్రారంభమయింది. చివరికి కెప్టెన్‌ను పదవి నుంచి దింపేయాల్సి వచ్చింది. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు.

కెప్టెన్ తర్వాత సిద్ధూకు సీఎం పదవి ఇవ్వలేదు. దళిత నేత అయిన చరణ్ జీత్ సింగ్ చన్నీకి రాహుల్ పట్టం కట్టారు. కొద్ది కాలమే అయినా చన్నీ పాలనలో ప్రజల్ని ఆకట్టుకున్నారు . దీంతో ఆయనకుప్రజల మద్దతు లభించింది. అదే సమయంలో సిద్దూ వ్యవహారశైలిపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా అసంతృప్తిగా ఉంది. ఆయనతో పెట్టుకుంటే ఇంకా ఇంకారచ్చ అవుతుందన్న భావనతో ఉన్నట్లుగా ఉన్నారు. దీంతో ఎన్నికలకు ముందు క్లారిటీ ఇవ్వాలనుకున్న రాహుల్.. చన్నీ పేరును ప్రకటించేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close