ఉద్యోగుల విషయంలో సీఎం అలా.. వైసీపీ ఇలా ! ఎవరు నిజం ?

” నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. మీరు లేకపోతే తాను లేను. ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం” ఇది పీఆర్సీ విషయంలో కొత్తగా సాధించిన విజయాల కారణంగా ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లిన ఉద్యోగ సంఘ నేతలతో సీఎం జగన్ అన్నమాటలు. ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ ఇంకా చాలా చెప్పారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమన్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఉద్యోగుల ఉద్యమం జరిగినంత కాలం వైసీపీ నేతలు.. వైసీపీ మీడియా చేసిన ప్రచారమే ఇప్పుడు హైలెట్ అవుతోంది.

వైసీపీ నేతలు ఉద్యోగుల్ని నానా మాటలన్నారు. లంచాలు తీసుకుంటారన్నారు. లక్షలు జీతాలు సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వంటి వారయితే మేం జీతాలు తీసుకోకుండా పని చేస్తాం.. మీరు సిద్ధమా అని సవాల్ కూడా చేశారు. ఇక ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగుల మీద లేనిపోని విషయాలు చెబుతూ ఇంటింటికి ప్రచారం చేసింది. వాలంటీర్లతో వారు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని ప్రచారం చేసింది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘ నేతలు కూడా చెప్పారు. ఉద్యోగులపై ప్రజల్లో తిరుగుబాటు తీసుకు రావాలని చూశారని ఆరోపించారు.

ఇక వైసీపీ మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. ఉదయమే కొమ్మినేని శ్రీనివాసరావు చర్చా కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం అర్థరాత్రి వరకూ సాగుతుంది. మధ్యంలో కామన్ మ్యాన్ వాయిస్ అంటూ వైసీపీ నేతల వాయిస్‌ను వినిపిస్తూ ఉండేవారు. అంటే ఉద్యోగులపైవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి మాత్రం ఉద్యోగులంటే ప్రభుత్వం అంటారు. ఈ డబుల్ మీనింగ్ వ్యవహారాలకు అర్థం ఏమిటో సామాన్య ఉద్యోగులకు అర్థం అయింది కానీ.. ఉద్యోగ సంఘం నేతలకు అర్థం అయినట్లుగాలేదు. వారికి అర్థం అయినా … అర్థం కానట్లు ఉంటారని.. అదే స్ట్రాటజీ అని ఉద్యోగులు అనుకున్నా.. అందులో తప్పేం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close