కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు కరెంటే పోలేదని ఇప్పుడు కరెంటే ఉండటం లేదననట్లుగా బీఆర్ఎస్ చేస్తున్న ఓవరాక్షన్ చూసి రాజకీయవర్గాలకూ మైండ్ బ్లాంక్ అవుతోంది. తెలంగాణలో కరెంట్ కోతల్లేవు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ సమ్మర్ లో అధిక వినియోగం వల్ల వచ్చే నిర్వహణ సమస్యలతో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడా నాలుగైదు నిమిషాలు కరెంట్ పోతోంది. దాన్నే చిలువలు పలువులుగా చేసి రాజకీయం చేసి కాంగ్రెస్ హయాంలో అసలు కరెంటే లేదన్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోషల్ మీడియా ఖాతాల్ని ప్రారంభించిన కేసీఆర్ అందులో విచిత్రాలు జరుగుతున్నాయంటూ… మహబూబ్ నగర్‌లో రెండు సార్లు కరెంట్ పోయిందని ట్వీట్ చేశారు. అక్కడ స్విచ్‌లు ఏమైనా ఆఫ్ చేసుకున్నారేమో కానీ… ఆ ఏరియాలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని ఆ విషయాన్ని డిజిటల్ మీటర్ రికార్డు చేసిందని విద్యుత్ అధికారులు ప్రకటించారు. దీంతో కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తాను మాత్రమే ఎక్కడ్నుంచో కరెంట్ తెస్తానని రేవంత్ కు చేతకాదన్నట్లుగా కేసీఆర్.. బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు.

ఈ కరెంట్ రాజకీయం ఎంత వర్కవుట్ అవుతుందో కానీ.. కేసీఆర్, బీఆర్ఎస్ పై మాత్రం పదవి లేకపోతే ఉండలేకపోతున్నారన్న ఓ రకమైన అభిప్రాయం ఏర్పడుతోంది. లేని సమస్యల్ని ఉన్నట్లు చూపడం కోసం.. సోషల్ మీడియా సైన్యాన్ని వాడేసుకుంటున్నారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మళ్లీ తప్పు చేయవద్దని ప్రజల్ని నిందిస్తున్నారు. వీరి రాజకీయానికి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close