శ్రీనివాసుడికి ఏడు కొండలు లేకుండా చేస్తున్నారా !?

టీటీడీ అధికారుల తీరు ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంది. తిరుమల అంటే శ్రీనివాసుడు . ..శ్రీనివాసుడు అంటే తిరుమల. అలాంటిది ఇప్పుడు తిరుమలను అంజనాద్రిగా ప్రాశస్త్యం కల్పించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు టీటీడీ అధికారులు. వివాదాస్పదమవుతున్నా.. స్వాముల్ని హౌస్ అరెస్ట్ చేసి మరీ శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు చేయడానికి వెనుకాడటం లేదు. కర్ణాటకలోని హంపీలో ఉన్న కిష్కింధ క్షేత్రమే హనుమంతుని జన్మస్థలమని.. టీటీడీ తప్పిదానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న గోవిందానంద సరస్వతిని ఇంట్లోనే ఉంచి పోలీసులు తాళం వేశారు.

ఆయన తిరుమల వచ్చి అంజనాద్రి శంకుస్థాపనను అడ్డుకుంటారని ఈ పని చేశారు. మరో వైపు ఈ అంశంపై న్యాయస్థానాల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. అంజనాద్రి కొండపై సుందరీకరణ పనులు తప్ప…. దేవాలయ ఏర్పాటు, ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించే విధంగా… అంజనాద్రి దేవాలయ నిర్మాణం చేపట్టబోతున్నారని పేర్కొంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

తిరుమల కొండల్లో మనుషుల చేతుల మీదుగా ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదని, పురాణాలు అదే విషయాన్ని చెబుతున్నాయని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హనుమంతుని జన్మస్థానం పేరుతో అంజనాద్రి కొండను ఏడు కొండల నుంచి వేరు చేసే యత్నం జరుగుతోందన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. టీటీడీని.. శ్రీ వేంకటేశ్వరుడని ఎందుకు ఇలా వివాదాస్పదం చేస్తున్నారో అధికారులకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close