వెబ్‌సైట్ మూసేసిన కొమ్మినేని !

సాక్షి టీవీలో ఉదయమే చర్చలు పెట్టి అందరూ నోరెళ్ల బెట్టే వాదనలు చేసే జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దేవులపల్లి అమర్ లాంటి వాళ్లకు కూడా సలహాదారు పదవులు ఇచ్చి రూ. లక్షలు నెలకు ఇస్తున్నా కొమ్మినేనికి ఎలాంటి పదవి ప్రభుత్వం ఇవ్వకపోగా ఇప్పుడు సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయే పరిస్థితి కల్పించింది. న్యాయవ్యవస్థపై దూషణల కేసులో ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూతో పాటు ఆయన తన కొమ్మినేని.ఇన్ఫో పేరుతో నిర్వహించే వెబ్‌సైట్‌లో రాసిన కథనాలపై సీబీఐ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఆయన స్క్రీన్‌పై కనిపించడం లేదు. అంతే కాదు తన వెబ్ సైట్‌ను కూడా పూర్తిగా మూసేశారు. అందులో వార్తలేమీ లేవు. మామూలు వార్తల్ని కూడా తీసేయడం చర్చనీయాంశమవుతోంది. సీబీఐ ఇటీవల న్యాయవ్యవస్థపై దూషణల కేసులో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తుందో స్పష్టత రావట్లేదు. ఏకంగా హైకోర్టు సీనియర్ లాయర్లను కూడా అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఎవర్నీ వదిలి పెట్టబోరన్న పరిస్థితి వచ్చింది. దీంతో కొమ్మినేని జాగ్రత్తల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఆయన తీరు ఉందన్న అభిప్రాయం ఇప్పటికే వినిపిస్తోంది. ఆరోగ్య సమస్యల వల్ల పక్కన మనిషి ఉండకపోతే బయటకు పోలేని పరిస్థితుల్లో ఇప్పుడు సీబీఐ ఆయనపై దృష్టి పెడితే జీవితంలో ఎప్పుడూ పడనన్ని కష్టాలు కొమ్మినేని పడే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ జాగ్రత్తలు ఎంత మేర ఆయనను కాపాడతాయో చూడాలి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close