సీబీఐ ఏఎస్పీపై కేసును నిలిపేసిన హైకోర్టు !

సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కడప పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తు అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులకు ఓ టెన్షన్ తీరిపోయినట్లయింది. సీబీఐ అధికారి రాంసింగ్ వివేకా హత్య కేసును చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. కీలకమైన విషయాలు వెలుగులోకి తెస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డు గొప్పగా ఉందన్నప్రచారం జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో రేప్ కేస్‌లోనూ రాంసింగ్ గట్టిగా నిలబడి ఎవరి ఒత్తిళ్లకూ లొంగలేదని అందుకే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే జైల్లోనే మగ్గుతున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు వివేకాహత్య కేసులోనూ ఆయన అంతేగట్టిగా విచారణ జరుపుతున్నారని అంటున్నారు. ఆయనపై వైఎస్ఆర్‌సీపీ నేతలు… వివేకా కేసులో అనుమానితులు పలు ఆరోపణలు చేస్తున్నారు. తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికి ముగ్గురు ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణాధికారిని ఒత్తిడికి గురి చేసి కేసును ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. ఈ క్రమంలో కేసు నమోదవడం కలకలం రేపింది. అయితే ఈ వివాదాన్ని వీలైనంత తక్కువలో ఉంచేందుకు సీబీఐ వ్యూహాత్మకంగా హైకోర్టును ఆశ్రయించింది. స్టే లభించడంతో సీబీఐ అధికారుల దర్యాప్తును ఏపీ పోలీసులు అడ్డుకునే అవకాశం లేకుండాపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close