కేటీఆర్‌కు పవన్ రాసిన లేఖలో ఎన్నెన్ని అర్థాలో..!

” ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలి ” ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ … తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖలో సూటిగా చెప్పిన మాట. ఇందులో డైరక్ట్ అర్థమే ఉంది కానీ తెలంగాణ నేతలకు అని ప్రత్యేకంగా చెప్పడం వల్ల ఇక్కడ ప్రస్తుత పరిణామాలను విశ్లేషించుకోవాల్సిన పరిస్తితి వచ్చింది. ఏపీలో సినిమా రంగాన్ని రాజకీయ కారణాలతో ఎలా వేధిస్తున్నారో కళ్ల ముందు కనిపిస్తోంది. స్వయంగా భీమ్లా నాయక్ సినిమాకే చుక్కలు చూపిస్తున్నారు.

దీనికి రాజకీయ కారణాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయం పేరుతో సినిమాలపై కక్ష సాధించడాన్ని పవన్ ఇలా కేటీఆర్‌కు ఇచ్చిన ప్రశంసల ద్వారా తప్పు పట్టారన్నమాట. ” కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని పవన్ లేఖలోపేర్కొన్నారు.

ప్రస్తుత హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూశాం. అటువంటి ఆత్మీయత కె.టి.ఆర్‌. లో ప్రస్పుటంగా కనిపిస్తుందన్నారు పవన్ కల్యాణ్. మొత్తంగా టీఆర్ఎస్‌పైనా పవన్ కల్యాణ్ గతంలో విమర్శలు చేశారు. రాజకీయంగా విభేదిస్తున్నారు. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. అయినా ఆయనపై తెలంగాణలో కక్ష సాధింపులేమీ లేవు. అందుకే పవన్‌కు తెలంగాణ నేతలపై ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడటంలో కూడా వింత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close