అవినాష్ రెడ్డి కోసం వివేకా కుమార్తెపై సాక్షి నిందలు !

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని చెప్పడానికి ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్షా అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి. అంతా కుటుంబం అని.. కుటుంబ సభ్యులను ఎందుకు చంపుకుంటామని సీఎం జగన్ వాదన. అంత వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు వివేకా క్యారెక్టర్‌పైనా.. ఆయన కుమార్తె, అల్లుడిపైనా నిందలు వేయడానికి వైసీపీ మీడియా చేస్తున్న ప్రయత్నాలు అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నాయి.

గతంలో ప్రత్యేక కథనాలు రాసిన సాక్షి పత్రిక ఇప్పుడు అరెస్టయిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య పేరుతో హైకోర్టులో ఓ పిటిషన్ వేయించి అందులో ఏముందో సమగ్రంగా వివరించారు. అది సరిపోదేమో అనుకున్నారు కానీ ప్రత్యేకంగా ఆ ఆ పిటిషన్‌ను క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి స్కాన్ చేసి చదువుకోమని పాఠకులకు సలహా కూడా ఇచ్చారు. గతంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడి పేరుతో సీబీఐకి ఇదే ఆరోపణలతో లేఖ రాశారు. ఇప్పుడు భార్య పేరుతో పిటిషన్ దాఖలు చేశారు.

తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ పోరాడి సీబీఐ విచారణ తెచ్చుకున్న సునీతపైనే ఇప్పుడు ఆరోపణలు చేస్తూ దాడి చేయడం ఇక్కడ అసలు ట్విస్ట్. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు తుడిచేసి.. పోస్టుమార్టం కూడా లేకుండా అంత్యక్రియలు జరిపించేసే ప్లాన్ అమలు చేసిన వారు సాక్షికి నిజాయితీపరులు.. నీతి మంతులుగా కనిపిస్తున్నారు. హంతకులు ఎవరో తేలాలని పట్టుబట్టిన వారే హంతకులుగా కనిపిస్తున్నారు. ఇందులో అసలు విషాదం ఏమిటంటే చనిపోయింది జగన్ సొంత బాబాయి… పోరాడుతోంది.. ఆయన చెల్లి. కానీ ఇక్కడ సాక్షి మాత్రం భిన్నమైన కథనాలు రాస్తోంది. సీఎం బాబాయి క్యారెక్టర్‌పై తప్పుడు ముద్ర వేసి.. ఆయన కుమార్తె, అల్లుడిపైనే నిందలేస్తోంది. అసలు విలువలే ఉండవనడానికి ఇదే నిదర్శనంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close