భీమ్లా నాయక్ థియేటర్ల వద్ద వైకాపా మంత్రులకు పవన్ అభిమానుల సెగ

ఇవాళ ఉదయం విడుదల అయిన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ మొదటి ఆట నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానుల లో జోష్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద రాజకీయ నినాదాలు సైతం వినిపించడం గమనార్హం. పైగా వైకాపా నేతలకు, ఈ థియేటర్ ల వద్ద పవన్ అభిమానుల సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.

గుడివాడలో జి 3 థియేటర్ ప్రారంభోత్సవానికి వైఎస్సార్సీపీ నేతలు మంత్రులు అయినటువంటి కొడాలి నాని, పేర్ని నాని విచ్చేశారు. ఈ థియేటర్లో ప్రారంభ చిత్రంగా భీమ్లా నాయక్ ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు జనసేన అభిమానుల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఇటీవలికాలంలో వైఎస్సార్సీపీ నేతలు, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలు తొక్కి వేసే విధంగా, పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తోందని పవన్ అభిమానులు వకీల్ సాబ్ సినిమా సమయం నుండి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కొందరు అధికారులు సైతం ఆ ఆరోపణలు నిజమని అనిపించేలా ప్రవర్తించటం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కొడాలి నాని డౌన్ డౌన్, పేర్ని నాని డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్ నినాదాలతో థియేటర్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని వరకు పరిస్థితి కొనసాగింది.

ఇదే విధంగా కుప్పం నెల్లూరు లో థియేటర్ల వద్ద కూడా, వైకాపా ప్రభుత్వం ఈ సినిమాపై కక్షపూరిత వైఖరి అవలంభిస్తోందని అంటూ ప్రేక్షకులు, అభిమానుల నుండి వైకాపా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినిపించడం చర్చకు దారి తీసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close