అలీకి ఇచ్చినట్లుగా పదవి ఇవ్వట్లేదన్న పోసాని

సినీ నటుడు అలీలాగే తనకు కూడా ఓ పదవి ఇస్తారనడంలో వాస్తవం లేదని నటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. నిజంగా ఇస్తానని చెబితే చెప్పుకోవడానికే తనకేంటి సిగ్గని ఆయన మీడియాను ప్రశ్నించారు. పోసాని కృష్ణ మురళి కూడా కుటుంబంతో సహా సీఎం జగన్‌ను కలిశారు. అయితే తనకు పదవి ప్రకటించే ఉద్దేశంతో అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని పోసాని మీడియాకు తెలిపారు. ఇటీవల తమ కుటుంబం కరోనా బారిన పడిందన్నారు.

ఆ సమయంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరామని .. ఈ విషయం తెలిసి సీఎం జగన్ ఆయన సతీమణి భారతి ఏఐజీ ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా సహకరించారన్నారు. వారి సహకారంతో తాము కరోనా నుంచి కోలుకున్నామని అందుకే సీఎం జగన్‌ను కుటుంబసమేతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పామన్నారు. సినీ నటుడు అలీ కూడా కుటుంబంతో కలిసి సీఎం జగన్ ను కలిశారు.

అప్పుడే ఆయనకు గుడ్ న్యూస్ వస్తుందని జగన్ చెప్పారు.కానీ పోసానికి మాత్రం అలాంటి గుడ్ న్యూస్‌లు వస్తాయని జగన్ చెప్పలేదు. అందుకే… తనకే ఏ పదవి ఇవ్వడం లేదని.. ఇస్తామని చెబితే చెప్పుకోవడానికి సిగ్గెందుకని ప్రశ్నించారు. ఈ మాటల్లోనే ఆయన నిరాశకు గురయినట్లుగా కనిపిస్తోంది. కానీ ఆయన బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ కోసం అంత చేటుగా ఆయన నోరు చేసుకున్నారు.. వైసీపీ దాటితే ఆయన పరిస్ధితి దారుణంగా మారిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనియాకే సన్మానం – కేసీఆర్‌కు లేదు !

తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఈసీ కూడా అనుమతి ఇచ్చింది. తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ పార్టీ నేతలు అభివర్ణించే...

పుణె స్టోరీ సైడ్ A : ధనవంతుల డ్రైవర్లే బలిపశువులు

ఓ ధనవంతుడి బిడ్డ తప్పతాగి డ్రైవింగ్ చేసి ఓ చిన్నారి ప్రాణం తీస్తాడు. పోలీస్ కేసవుతుంది. తన బిడ్డ ఎక్కడ జైలుకుపోతాడోనని ఆ రిచ్ కిడ్ తల్లిదండ్రులు .. డ్రైవింగ్ చేసింది...

జూ.ఎన్టీఆర్‌పై చర్చ – పని లేని టీడీపీ నేతల పంచాయతీ !

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి మొన్నటిదాకా వైసీపీ నేతలు రాజకీయం చేసేవారు. టీడీపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించేవారు. రకరకాల బ్యానర్లు టీడీపీ ర్యాలీల్లో వైసీపీ కార్యకర్తలే తీసుకు వచ్చారు. ఇక...

తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు ఇవే…!?

పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా దూకుడు పెంచారు. ఈ విషయంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకున్న ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close