సులభ్ కాంప్లెక్స్ లకి రోజువారి టార్గెట్లు , వార్డు సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు

ఖాళీగా ఉందని తాజ్ మహల్ మీద తువ్వాలారేస్తావా ? అని ఓ సినిమలో కమెడియన్ సునీల్ సెటైర్ వేస్తాడు. ఏపీ ప్రభుత్వం వాడకం చెప్పాలంటే ఇంత కంటే చాలా ఎక్స్‌ట్రీమ్ డైలాగ్ వాడుకోవాలి. అయితే ఇక్కడ వాడుతోంది మాత్రం ఉద్యోగుల్ని. వార్డు సచివాలయ ఉద్యోగుల్ని సులభ్ కాంప్లెక్స్‌ల దగ్గర డబ్బుల వసూళ్లకు వాడేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని పే అండ్ యూజ్ టాయిలెట్లను నిర్మించింది. పలు సెంటర్లలో ఇవి ఉన్నాయి. వీటి వద్ద వార్డు సచివాలయ అడ్మిన్లు, సెక్రటరీలకు డ్యూటీ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి . డ్యూటీ చేస్తే సరిపోదు..  మరుగుదొడ్ల దగ్గర రోజుకు రూ. ఐదు వేలు వసూలు చూపించాలి.  టాయిలెట్ల దగ్గర డ్యూటీ కేటాయించిన వారిలో ఓ మహిళా వార్డు సెక్రటరీ, అడ్మిన్ కూడా ఉండటం ట్విస్ట్.
గుంటూరు కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన ఈ ఉత్తర్వులు చూసి ఉద్యోగులు ఉలిక్కి పడ్డారు. సోషల్ మీడియాలోనూ ఈ ఉత్తర్వులు వైరల్ అయ్యాయి. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్పందించారు. టాయిలెట్ల నిర్వహణను చూసే కాంట్రాక్ట్ ముగిసిపోయిందని.. కొత్తగా ఎవరికీ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకూ సచివాలయ అడ్మిన్లకు బాధ్యతలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అయితే అడ్మిన్లకు తోడుగా ప్రజారోగ్య కార్యకర్తలు ఉంటారని వారు డబ్బులు వసూలు చేస్తారని. వీరు డబ్బులు దుర్వినియోగం కాకుండా చూస్తే చాలని చెప్పుకొచ్చారు.
కొద్ది రోజుల కిందట ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేయడం కలకలం రేపింది. చర్చనీయాంశమయింది. ఇప్పుడు వార్డు సచివాలయ ఉద్యోగులకు మరింతదారుణంగా సులబ్ కాంప్లెక్స్ డ్యూటీలు వేయడం కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close