కాళేశ్వరం కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు.. ఆట మొదలైందా?

తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ప్రారంభమయినట్లుగానే కనిపిస్తోంది. బీజేపీ అసలు రంగంలోకి దిగే ముందు మిత్రపక్షాలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాయని కొంత కాలంగా సెటైర్లు వినపడుతూనే ఉన్నాయి. ఆ మిత్రపక్షాలు ఎవరో కాదు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు తెలంగాణలో ఐటీ అధికారులు పనులు మొదలు పెట్టినట్లుగా రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీని టార్గెట్ చేసుకుని నిర్వహిస్తున్న సోదాలతో ఓ అంచనాకు వస్తున్నారు.

కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద వివిధ ప్యాకేజీల పనులు చేస్తోంది. దాదాపుగా రూ. పదివేల కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంస్థ ఎప్పుడూ ప్రచారంలోకి రాలేదు. గుట్టుగా పని చేసుకుంటూ పోతుంది. వరంగల్‌కు చెందిన ఈ సంస్థ యజమానికి .. టీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడుఈ సంస్థ అకౌంట్స్ లోటుపాట్లన్నీ బయటకు తీస్తున్నారు. ఏదో లేకపోతే.. సంస్థ పని చేసే సైట్స్‌లోనూ సోదాలు చేయాల్సిన అవసరం ఏముంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ముందుగా తాము టార్గెట్ చేసిన అధికార పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడం.. మరెవరు ఆ పార్టీకి ఆర్థిక మద్దతు ఇవ్వకుండా చేసి.., ఆ తర్వాత బీజేపీ ప్రత్యక్షంగా రాజకీయ రంగంలోకి దిగుతుందన్న అభిప్రాయం ఉంది. ఆ ప్రకారం చూస్తే ఇప్పటికి బీజేపీ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసిందనుకోవాలి. ముందు ముందు ఈ దాడులు పెరుగుతాయి. ఇవి చాలా ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. మొత్తంగా బీజేపీ ఆట మొదలు పెట్టినట్లేనని తెలంగాణ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close