మేకపాటి గౌతంరెడ్డి భార్యకు మంత్రి పదవి !

మేకపాటి గౌతంరెడ్డి భార్యకు నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉపఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఆమెనే నిలబెట్టాలని జగన్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మేకపాటి గౌతంరెడ్డి భార్య పేరు శ్రీకీర్తి. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో వేలు పెట్టలేదు. మేకపాటి కుటుంబం కూడా శ్రీకీర్తికి రాజకీయాలు అంటే ఇష్టం లేదని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. గౌతం రెడ్డి పిల్లలు ఇంకా చిన్నవారే. దాంతో పోటీ చేసే పరిస్థితి లేదు.

ఇప్పుడు ఆత్మకూరు నుంచి ఎవరిని నిలబెట్టాలన్నదానిపై మేకపాటి కుటుంబంలోనే చర్చ జరిగింది. మేకపాటి రాజమోహన్ రెడ్డితోపాటు ఆయనకు ఉన్న మరో ఇద్దరు కుమారులపై చర్చ జరిగింది. అయితే రాజమోహన్ రెడ్డి వయోభారం కారణంగా జగన్ ఆసక్తి చూపించలేదు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి రాజకీయాలపై ఆసక్తి ఉన్నా.. ఇది సరైన సమయం కాదని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల మేకపాటి గౌతంరెడ్డి సంతాపసభకు వెళ్లిన జగన్… రాజకీయ వారసత్వంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

దీంతో జగన్ ఏమనుకుంటున్నారో అన్న చర్చ జరిగింది. అయితే.. జగన్ మంత్రివర్గ కూర్పు కోసం కసరత్తు చేసినప్పుడు శ్రీకీర్తిని మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. దీంతో పదకొండో తేదీన జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఆమెకు పదవి లభించడం ఖాయమని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్ల‌మ్మ‌కు కేసీఆర్ యాది కొస్తున్నారా… రాముల‌మ్మ ట్వీట్ అంత‌రార్థం ఏంటో?

కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా విజయశాంతి బీజేపీకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన...

ఏపీలో ర‌క్త చ‌రిత్ర‌… ఇప్పుడే ఇలా ఉంటే ఫ‌లితాల రోజున ఎలా ఉంటుందో?

ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో...

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close