ఈ సారి తెలంగాణలో రాహుల్ టూర్ పక్కా !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఈ నెల 28న వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. తర్వాతి రోజు ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. పార్టీ నేతల సమావేశంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించక చాలా కాలం అవుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియమితులయ్యాక.. పలుమార్లు రాహుల్ గాంధీతో సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ సారి మాత్రం రాహుల్ గాంధీ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాజకీయ ప్రయోజనాలు పొందడంలో మాత్రం విఫలమవుతోంది. కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి నడిపించే నాయకుడు కరవవడం.. కొత్తగా ఎవరిని నియమించినా గ్రూపు తగాదాలు పెరిగిపోవడంతో పార్టీ విజయాలు నమోదు చేయలేకపోతోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించిన తర్వాత కూడా పరిస్థితులు మారలేదు. సీనియర్లు ఆయనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణ పర్యటనపై ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదు.

అయితే ప్రస్తుతం అందర్నీ ఢిల్లీకి పిలిపించి మూడు గంటల పాటు రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. పార్టీని నష్ట పరిస్తే ఊరుకునేది లేదని సీనియర్లకు నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అందరూ సైలెంటయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో మన ఊరు – మన పోరు వంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. రాహల్ గాంధీ పర్యటన తర్వాత క్యాడర్‌లో మరింత ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close