హర్యానా – పంజాబ్ మధ్య రాజధాని చిచ్చు!

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పేరుతో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న రచ్చను చూస్తూనే ఉన్నాం. అయితే ఏపీ పాలన గతంలోనే ఏపీకి వెళ్లిపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఓ పెద్ద పంచాయతీకి ముందుగానే తెరపడింది. కానీ పంజాబ్ – హర్యానా మధ్య ఇప్పుడు అలాంటి రాజధాని పంచాయతీ వచ్చేసింది. రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంది.అదే చండిగఢ్. రెండు ప్రభుత్వాలూ అక్కడి నుంచే నడుస్తాయి. అందుకే ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేశారు.

కేంద్ర పాలిత ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగుల విషయంలో ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా కొన్ని కొత్త రూల్స్ తీసుకు వచ్చారు. ఇవి పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మన్ కు నచ్చలేదు. వెంటనే చండిఘడ్‌ను తమకు బదిలీ చేయాలని ఆయన తీర్మానం చేసేశారు. ఇక హర్యానా మాత్రం ఊరుకుంటుందా ? పైగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక వెంటనే రివర్స్ తీర్మానం చేశారు. . అంటే రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ ప్రారంభమైనట్లేనని అనుకోవాలి.

ఇక్కడ బీజేపీ రాజకీయం చాలా చురుగ్గా ఉందని అనుకోవాలి ఎందుకంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ .. హర్యానాకు చెందిన వ్యక్తి. ఈ అంశాన్ని చండిఘడ్ విషయంలో ఆ పార్టీ తీరును ఇటు హర్యానాలో సెంటిమెంట్ గా మార్చి.. అక్కడ కూడా బలపడకుండా చేయడం.. అదే సమయంలో పంజాబ్‌లో హర్యానా వ్యక్తి నేతృత్వంలోని పార్టీతో పంజాబ్ ప్రయోజనాలు కాపాడలేరన్న అభిప్రాయాన్ని కల్పించే లక్ష్యంగా ఈ రాజకీయం ప్రారంభమైనట్లు ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close