వైసీపీ కార్యకర్తలకు విజయసాయి జాబ్ మేళాలు !

వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించినప్పటికీ ఇంకా చాలా మంది ఖాళీగానే ఉన్నారు. ప్రభుత్వం వచ్చినా మాకేమీ ఉపయోగం లేదని బాధపడుతున్న వారు పెరిగిపోతున్నారు. దీంతో విజయసాయిరెడ్డి జాబ్ మేళాలు ప్లాన్ చేశారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో శనివారం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాల్లో 147 కంపెనీలు పాల్గొంటున్నాయని వేల మందికి ఉద్యోగాలివ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ కంపెనీలు ఏమిటి.. ఎలాంటి ఉద్యోగాలిస్తారు.. అన్నదానిపై స్పష్టత లేదు. కానీ గతంలో కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవి ఏర్పాటు చేస్తున్నారు.

చాలా రోజుల నుంచి జాబ్ మేళాల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు.. విశాఖ ఫార్మాసిటీలో ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత శ్రీకాకుళంలోనూ… అలాంటి మాటే చెప్పారు. స్థానిక ఎన్నికలకు ముందే కార్యకర్తలకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ఇప్పుడు జాబ్ మేళాలు పెడుతున్నారు. అవి కూడా ప్రైవేటు కంపెనీలు. ఇచ్చేది కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఎక్కువ.

ఉద్యోగాలు చేయాలనుకుంటే.. వారందరూ ఎప్పుడో సీరియస్‌గా ప్రయత్నించి ఉద్యోగాలు చేసుకునేవారని.. వైసీపీ కోసమే వారు ఆ ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేశారని.. రాజకీయంగా వారు ప్రాధాన్యత కోరుకుంటున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. అయితే విజయసాయిరెడ్డి మాత్రం.. వారి అసంతృప్తి ఉద్యోగాల కోసమేనన్నట్లుగా ఉన్నారు.. ఎంత మందికి ఉద్యోగాలిప్పిస్తారో వచ్చే రెండు, మూడు రోజుల్లో తేలనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close