ఇంతకీ హర్యానా సీఎంను ఏపీ సీఎం ఎందుకు కలిసినట్లు !?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు. వీరి మధ్య భేటీ దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. హర్యానా సీఎంతో సమావేశం కోసమే ప్రత్యేకంగా జగన్ తాడేపల్లి నుంచి విశాఖ వచ్చారు. బేపార్క్‌లో హర్యానా సీఎం నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాకు సీఎం. ఆయన బీజేపీ తరపున ఏమైనా చర్చలు జరిపి ఉంటారా అన్న సందే్హం రాజకీయవర్గాల్లో కలుగుతోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికి అవసరమైన మెజార్టీ భారతీయ జనతా పార్టీకి.. ఎన్డీఏకు లేదు. ఖచ్చితంగా ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిందే. వైఎస్ఆర్‌సీపీకి అంటు ఎంపీల పరంగా.. ఇటు ఎమ్మెల్యేల పరంగా కూడా గణనీయమైన ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీ మద్దతిస్తే బీజేపీ పని సులువు అవుతుంది . ఈ అంశంపై ఖట్టర్ చర్చించి ఉండవచ్చని భావిస్తున్నారు. హర్యeనా అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ అంశాలమైనా చర్చించారా అన్న చర్చలు ఇవన్నీ కాకపోతే.. సీఎం జగన్మోహన్ రెడ్డికి అనేక కంపెనీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పెట్టుబడుల అంశం ఏమైనా చర్చించి ఉంటారని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం అధికారికంగా చెబితే ఇలాంటి ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.కానీ సీఎంవో ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. ఏపీకి వచ్చిన హర్యానా సీఎంను జగన్ మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని ఈ సమావేశానికి ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఊరకనే మర్యాద పూర్వకంగా జగన్ వెళ్లి కలుస్తారంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close