బొత్సకు పాత శాఖే కావాలి..బుగ్గనకు వద్దు !

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇద్దరు సీనియర్ మంత్రులు మౌనం సీఎం జగన్‌ను ఇబ్బంది పెడుతోంది. వారిద్దరికీ మళ్లీ మంత్రి పదవులు ఇచ్చినా బాధ్యతలు తీసుకోవడం లేదు. దీనికి కారణం వారికి కేటాయించిన శాఖలు నచ్చకపోవడమే. అందుకే ఇప్పటి వరకూ బాధ్యతలు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ కేటాయంచారు. ఆయనకు ఆ శాఖ అంటే ఆసక్తి లేదు. ఈ విషయం మొదటే వెల్లడయింది. విద్యాశాఖను చూసుకుంటూ తాను పార్టీపై దృష్టి పెట్టలేనని.. ఇప్పటికే మున్సిపల్ శాఖపై తనకు పట్టు చిక్కింది కాబట్టి అదే శాఖ ఇవ్వాలని జగన్ వద్దకు ప్రతిపాదన పంపినట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో మరో సీనియర్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికూడా బాధ్యతలు తీసుకోలేదు. ఆయన బాధ వేరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బొత్స తనకు పాత శాఖే కావాలంటే .. బుగ్గన మాత్రంతనకు పాత శాఖ వద్దంటున్నారు. బుగ్గన ఇప్పటి వరకూ ఆర్థికమంత్రిగా ఉన్నారు. తాజాగా కూడా ఆయనకు ఆర్థికశాఖే కేటాయించారు. కానీ ఈ శాఖ మాత్రం వద్దని బుగ్గన చెబుతున్నారు. నిజానికి ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన చేసిందేమీ లేదు. అప్పుల కోసం ఢిల్లీలో అయినవాళ్లకు..కానివాళ్లకు శాలువాలు కప్పడం మినహా.మిగతా మత్తం సజ్జలే చూసేవారు. ఆ మాత్రం దానికి తనకు ఆ శాఖ వద్దని అంటున్నారు. మరొకటి ఇవ్వాలంటున్నారు.

ఈ ఇద్దరు మంత్రులు బాధ్యతలు తీసుకోకుండా శాఖల్లో మార్పులు కోరుకుంటున్నారు. వారి ప్రతిపాదనలు ప్రస్తుతం జగన్ వద్దకు వెళ్లాయి. జగన్ పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ తాను చెప్పిందే శాసనం అన్నమూడ్ నుంచి బయటకు వచ్చారని… పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అందర్నీ పిలిచి బుజ్జగించడమే కాదు..వీలైతే డిమాండ్లను పరిష్కరిస్తున్నారని అంటున్నారు. అదే నిజం అయితే.. బొత్స, బుగ్గన శాఖలు మారే అవకాశం ఉంది.ఒక వేళ బొత్సకు ఆర్థిక శాఖ ఇస్తే ఆయన పరిస్థితి పనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close