ఏబీవీకి ఇక ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వక తప్పదా?

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నారు. సస్పెన్షన్ విధించి రెండేళ్లు కావడం… ఇంకా పొడిగించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కావడం.. ఇప్పటి వరకూ అలాంటి అనుమతి ఏమీ కేంద్రం ఇవ్వకపోవడంతో .. దిక్కుతోచని స్థితిలో ఏపీ ప్రభుత్వం పడిపోయింది. గురువారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏబీ సస్పెన్షన్‌నుఇంకా ఎంత కాలం కొనసాగిస్తారని ప్రశ్నించింది.

రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలను సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాల కోసం చూస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం ఏమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శుక్రవారంలోగా అన్ని వివరాలతో రావాలని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని అభిప్రాయం పడింది.

శుక్రవారం విచారణ తర్వాత వాయిదా వేయడం కుదరదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరారవుపై అభియోగాలు పూర్తిగా నిరూపణ కాకుండానే… ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రానిక ిసిఫారసు చేసింది. ఇది చేసి చాలా కాలం అయింది. అయితే కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోందో కీలకమయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close