అంబటిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ : అయ్యన్నపాత్రుడు

అంబటి రాంబాబు మంత్రి పదవికి గండం వచ్చిందని వైసీపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్ చానల్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఇంటర్యూ కావాలని ఆయనకు వాట్సాప్ మెసెజ్ పెడితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే వైసీపీలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కూడా ట్వీట్ చేశారు. అంబటి రాంబాబు ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయట ప్రపంచానికి తెలుస్తాయని అయ్యన్న ప్రకటించారు.

ఇవేమీ రహస్యం కాదని సీఎం సహా చేరాల్సిన వారి దగ్గరకు చేరాని త్వరలో అంబటి రాంబాబును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం ఖాయమని ఆయన ట్వీట్ చేశారు. అయ్యన్నపాత్రుడు ట్వీట్‌తో ఇప్పటి వరకూ వైసీపీలో అంతర్గతంగా జరిగిన చర్చ బహిర్గతమయింది. అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం గతంలో అంబటి రాంబాబుపై ఈ తరహా ఆరోపణలు ఉండటమే.

గతంలో సంజనా అనే మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. టీవల సుకన్య అనే మహిళతో మాట్లాడినట్లుగా ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అవి తనవి కాదని అంబటి రాంబాబు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరుతో మార్ఫింగ్ ఆడియోలు రిలీజ్ చేసినా పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో అవి ఆయనవేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close