జగన్ దావోస్ వెళ్లగానే పెట్టుబడులు రావంటున్న మంత్రి !

సీఎం జగన్ దావోస్ పర్యటనకు వెళ్లిన వెంటనే పెట్టుబడులు రావని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్ ఈ నెల 22 నుంచి దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓ బ్రోచర్‌ను మంత్రి అమర్నాథ్ విడుదల చేశారు.
ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తాయి అనే అనుమానాలు చాలా మంది లో ఉంటాయని.. ఎకనామిక్ ఫోరమ్ అనేది పెద్ద కంపెనీలు పారిశ్రామిక ప్రగతి పై చర్చించే వేదిక అని సహజంగానే ఏపీ పారిశ్రామిక స్థితి గతులు పై చర్చ జరుగుతుందన్నారు.

22 నుంచి 26 వరకు జరిగే దావోస్ పర్యటనతోనే పెట్టుబడులు రావన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక టీం తో ముందుకు వెళ్లి ఏపీ కి రావాల్సిన పెట్టుబడులు పైచర్చిస్తామమని.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్మన్ తో కూడా సీఎం జగన్ చర్చిస్తారని అమర్నాథ్ ప్రకటించారు. 22వ తేదీన దావోస్ వెళ్లే సీఎం జగన్ అక్కడ 23వ తేదీన వైద్యరంగంపై కీలక సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. డీసెంట్రలైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశం జరుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి , పరిశ్రమల మంత్రిగా అమర్నాథ్ తో పాటు ్ధికారులు పాల్గొన్నారు.

దావోస్‌లో కోవిడ్ తర్వాత కాలంలో పారిశ్రామిక మార్పులు పై చర్చ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడుప్రతీ ఏడాది సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దావోస్ వెళ్లేవారు. పెట్టుబడులుపెట్టాడనికి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేవారు. అనేక పరిచయాలో పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి వచ్చాయి. అయితే ఈ టూర్లన్నీ డబ్బు ఖర్చు వృధా అని వైసీపీ నేతలు ఆరోపించేవారు. ఇప్పుడు జగన్ కూడా పెద్ద బృందంతో దావోస్ వెళ్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close