ఆ రకంగా జగన్‌ కోరిక నెరవేరింది!

మొత్తానికి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి కోరిక నెరవేరింది. పైకి సింపుల్‌గా కనిపించినప్పటికీ.. ఇది ఆయనకు చాలా పెద్ద ఊరట కిందే లెక్క. ఢిల్లీ వెళ్లిన సమయంలో అక్కడ చక్రం తిప్పారో, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా అర్ధరాత్రి ఢిల్లీ మీటింగుల ద్వారా రిజల్టు సాధించారో తెలియదు గానీ మొత్తానికి వైఎస్‌ జగన్‌ కాస్త తాను అనుకున్నది సాధించుకోగలిగారు.

అబ్బే.. ఇదంతా.. ఆయన పార్టీలోంచి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలను నియంత్రించడానికి సంబంధించిన గొడవ కాదు. అందులో ఆయన ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు. పోతూ ఉన్న వారిని చూస్తూ ఉండాల్సిందే. కాకపోతే.. పార్టీనుంచి వలసలకంటె ఎక్కువగా జగన్‌ను ఇబ్బందిపెడుతున్న ఈడీ కేసులకు సంబంధించిన వ్యవహారం ఇది. ఈ విషయంలో జగన్‌ కోరిక నెరవేరింది.

వివరాల్లోకి వెళితే.. జగన్‌ అక్రమాస్తుల కేసులో పెట్టుబడలుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌కు బదిలీ చేయాలంటూ ఈడీ ఒక పిటిషన్‌ వేసిఉంది. హైదరాబాదులోని సీబీఐ కోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ విచారణలు తీవ్రంగా ఉండబోయే నేపథ్యంలో జగన్‌ ఇటీవల హైకోర్టుకు ఒక ప్రత్యేక అభ్యర్థన పెట్టుకున్నారు. అసలు తన మీద ఉన్న సీబీఐ కోర్టు విచారణ మొత్తం పూర్తయ్యేవరకు ఈడీ కోర్టులో విచారణను ఆపు చేయించాల్సిందిగా కోరుతూ ఆయన హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. అయితే హైకోర్టు ఆ విజ్ఞప్తిని కొట్టేసింది. రెండు కోర్టుల్లో విచారణ ఇబ్బంది అయ్యేట్లయితే.. సీబీఐ కేసు కూడా ఈడీకి మార్చేయమంటారా అంటూ హౖాెకోర్టు ప్రశ్నించడంతో జగన్‌ వర్గం కుదేలై.. అలా వద్దంటూ విన్నవించుకున్నారు.

ఈలోగా సీబీఐ కేసును తమ కోర్టుకు మార్చాలంటూ ఈడీ ఒక పిటిషన్‌ వేయడం గమనార్హం. అదే జరిగితే.. జగన్‌ ప్రతిసారీ విచారణకు ఈడీ కోర్టుకే ఢిల్లీ వెళ్లి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ చిక్కు నుంచి తప్పించుకోవడానికి జగన్‌ ప్రయత్నించారు. ఆయన తరఫు న్యాయవాదులంతా.. జగన్‌ అక్రమాస్తుల అవినీతి కేసుల్ని విచారించే అధికారం ఈడీ కోర్టుకు లేదంటూ వాదనలు వినిపించారు. ఏదైతేనేం మొత్తానికి సీబీఐ కేసును ఈడీకి బదిలీ చేయడం కుదరదంటూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఈడీ వారి పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో.. జగన్‌కు కాస్త ఊరట దొరికినట్టే అనుకోవాలి. పైకి కనిపించకపోయినప్పటికీ.. ఈ కేసులో ఈడీ తీవ్రత పరంగా చాలా చికాకు ఉండడంతో ఇప్పటికి ఒక ఇబ్బంది తొలగిపోయిందని, జగన్‌ ఇక పార్టీకి కలుగుతున్న నష్టం మీద కాస్త పూర్తి శ్రద్ధ పెట్టగలరని పలువురు అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close