పాస్టర్ల కోసం ఎన్నో రూల్స్ సడలింపు – అసలిస్తారా ?

పాస్టర్లకు నెలకు రూ. ఐదువేలిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అమలు చేయాలి. కనీసం ఇతర పథకాల్లా చేసిటన్లుగా చూపించాలి. అంటే ఒక్క సారి అయినా బటన్ నొక్కాలి. అలా నొక్కడానికి లబ్దిదారుల జాబితా అంటూ ఉండాలి కదా.. గత మూడేళ్లుగా పాస్టర్ల జాబితాను రెడీ చేస్తూనే ఉన్నారు ఏపీ ప్రభుత్వం “అర్హత” పేరుతో లబ్దిదారులను ఓ ఆట ఆడుకుంటోంది. పాస్టర్లను కూడా అాలగే ఆడుకుంటోంది.

పాస్టర్లకు అలవి మాలిన రూల్స్ పెట్టడంతో లబ్దిదారులే కనిపించకుండా పోయారు. అలా అయితే ఎలా అని వరుసగా రెండు, మూడు సార్లు నిబంధనలు మార్చారు. మరోసారి నిబంధనలు మార్చారు. చర్చిలు ఎక్కడ ఎలా ఉన్నా పాస్టర్లుగా అర్హులేనని.. ఒకే ఇంట్లో ముగ్గురు…నలుగురు పాస్టర్లు ఉన్నా అర్హులేనని రూల్స్ మార్చేశారు. ఇన్ని రూల్స్ మార్చిన వారు ఇప్పటి వరకూ లబ్దిదారుల జాబితా ఖరారు చేయలేదు.

పాస్టర్లు కూడా ప్రభుత్వం తమతో గేమ్ ఆడుతోందని ఆందోళన చెందుతున్నారు. పాస్టర్లకు ఆర్థిక సాయం చేస్తే ఇతర వర్గాల నుంచి విమర్శలు వస్తాయన్న కారణంగా ప్రభుత్వం ఆగుతోందని.. ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం లేదని ఎక్కువ మంది పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరు అలాగే ఉంది. చివరికి అసలు పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. వారు ఎలాగూ ఇతరులకు ఓట్లు వేయరని.. తమ ఓటు బ్యాంకే కాబట్టి… ఇవ్వకపోయినా పర్వాలేదని అనుకునే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close