బీజేపీని కూడా ఒప్పిస్తానంటున్న పవన్ !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీగానే ఉన్నారు. ఆయన తాను బీజేపీని వదిలేస్తానని ఎక్కడా చెప్పడం లేదు. కానీ ఓట్లు చీలిపోకుండా… ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీని ఒప్పిస్తానని అంటున్నారు. అమరావతి విషయంలో అంగీకరింపచేసినట్లే.. ఓట్లు చీలకుండా బీజేపీతో మాట్లాడతానని ఆయన అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ లాంటి వారు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరో వైపు జనసేన పార్టీ అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది .

ఓట్లు చీలనివ్వమని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పు వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ వ్యాఖ్యలు… ఓట్లు చీలేందుకు ఓ చాయిస్ కల్పిస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీని వదిలేస్తారన్న ప్రచారం ప్రారంభమైంది. జనసేన క్యాడర్‌లోనూ బీజేపీతో పొత్తుపై పెద్దగా పాజిటివ్ లేదు.బీజేపీ వల్ల తమకు ఒక్క ఓటు అదనంగా రాకపోగా.. ఉన్న మైనార్టీ ఓట్లు పోతున్నాయని అదే సమయంలో బీజేపీ తమ ఓటు బ్యాంక్‌ను బాగానే కవర్ చేసుకుని.. బలపడుతున్నామన్న భావన కల్పించుకుంటోందని అంటున్నారు.

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్‌లను ఏపీలోనూ ఉపయోగించుకోవాలంటే ఆ పార్టీతో పొత్తు ఉండాలని పవన్ కూడా కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి వైసీపీ అధికారం నిలబెట్టుకునేందుకు అధికారాన్ని అడ్డంగా వాడుకుంటుందని దాన్ని అడ్డుకోవడానికి మరో అధికార కేంద్రం కావాలని జనసేనాని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో ముందస్తు ఎన్నికల చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ప్రధానంగా పొత్తుల ప్రస్తావనే వస్తోంది. అందులోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే ఆయన పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close