నవంబర్‌లో అసెంబ్లీ రద్దు చేయనున్న జగన్ !?

మళ్లీ జగన్‌నే సీఎం చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు బస్సు యాత్రలో ఆగిన చోటల్లా విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్ సామాజిక న్యాయం చేస్తారని అంటున్నారు. సామాజిక న్యాయం అంటే ఏమిటో అందరికీ తెలుసో లేదో కానీ మళ్లీ జగన్‌నే సీఎం చేయాలంటూ మంత్రులు అడుగుతున్న వైనం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి ఇంకా మూడేళ్లు కూడా కాలేదు. మరో రెండు రోజులకు మూడేళ్లు నిండుతాయి. ఇంకా రెండేళ్లు ఉండగానే జగన్ ను సీఎం చేయాలంటూ మంత్రులు రోడ్డెక్కడం… రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత శరవేగంగా పెరుగుతోందని ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎలాగోలా బయటపడవచ్చన్న అనేక రకాల సర్వేలు వెల్లడించడంతో జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ నేతలందర్నీ గడపగడపకు పంపడమే కాకుండా.. . సామాజిక న్యాయం పేరుతో కొత్తగా పదవులిచ్చిన వారితో యాత్ర కూడా చేయిస్తున్నారు. ఓ రకంగా అది ఎన్నికల ప్రచారమే అనుకోవచ్చు.

వచ్చే నెలాఖరులో ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది. అక్కడ భారీ మెజార్టీ సాధించి.. వైసీపీకి తిరుగులేదన్న అభిప్రాయం కల్పించడం కోసం భారీగా ప్రచారం నిర్వహింప చేసుకుని నవంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నారని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. అయితే దీనిపై స్పష్టమైన సమాచారం పార్టీ నేతలుకూ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి. అందుకే టీడీపీ కూడా పాలించే దమ్ము లేకే ముందస్తుకు వెళ్తున్నారని విమర్శలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

కళ్ల ముందు ఓటమి – వాస్తు మార్పులతో జగన్ ప్రయత్నం !

అభ్యర్థులను మార్చారు వర్కవుట్ అవలేదు. బస్సు యాత్ర పేరుతో తనను తాను మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వర్కవుట్ అవ్వలేదు.. ప్రజలు మార్పు చేయడానికి సిద్ధమయ్యారని స్పష్టత రావడంతో చివరి...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కదలిక… ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు..!?

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్తబ్దత నెలకొందని ప్రచారం జరుగుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ప్రధాన సూత్రధారి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్...

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close