“కూల్చేసిన” ప్రాంతంలోనే నిర్మాణాలకు సుప్రీంకోర్టు ఓకే !

రుషికొండలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం … ఎన్జీటీ ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకెళ్లిపోరాడి అనుకున్నది సాధించింది. సుప్రీంకోర్టు కొత్తగా ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని స్పష్టం చేసినా… నిర్మాణాలను అనుమతి ఇచ్చింది. ఆ నిర్మాణాలు కేవలం గతంలో ఉన్న హరిత రిసార్టును కూల్చివేసిన ప్రాంతంలోనే నిర్మించాలని కొత్త ప్రాంతంలో వద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం అసలు కొండే లేదు. పూర్తిగా తొలిచేశారు.
హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పాత రిసార్టు ఉన్న ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా ఎలాంటి తవ్వకాలు వద్దని చెప్పడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయినట్లేనని భావిస్తున్నారు. హైకోర్టులో తేలే వరకూ ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది.

రిషికొండ సమీపంలో ప్రభుత్వానికి చెందిన హరితా రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు ఈ రిసార్ట్స్ వసతి సౌకర్యం కల్పించేవి. అయితే అకస్మాత్తుగా వాటిని కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెద్ద స్థాయి టూరిజం హోటల్ కడతామని రిషికొండను తవ్వేస్తున్నారు. అయితే ఆ మాట అధికారికంగా చెప్పడం లేదు. మరోవైపు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం కోసం అని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు కూల్చేసిన రిసార్టుల ప్లేస్‌లో మాత్రమే కట్టుకోవడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇది చాలు అనుకుని మొత్తం పనులు చేస్తారో … లేకపోతే.. అక్కడే గాల్లో నిర్మాణాలు చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close