ఢిల్లీ టూర్ : రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించనున్న జగన్ !?

దావోస్ నుంచి రాగానే ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ కావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఎప్పుడెళ్లినా ఏం చర్చిస్తున్నారో ఎవరికీ చెప్పడం లేదు. ఎప్పుడూ విడుదల చేసే ఓ ప్రెస్ నోట్‌ను తేదీ మార్చి విడుదల చేస్తూంటారు. ఈ సారి పర్యటన తర్వాత కూడా కొత్త అంశాలేమైనా ఉంటే చేర్చి ప్రెస్ నోట్ విడుదల చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ టూర్ వెనుక అంతర్గత ఎజెండా ఏమిటన్నది మాత్రం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నడుస్తోంది. అడగకపోయినా సరే రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ బీజేపీనిలబెట్టే అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించేందుకు సీఎం జగన్ వెళ్తున్నారని భావిస్తున్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా జగన్ బీజేపీ అడగకపోయినా ప్రత్యేకంగా ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని మరీ వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. తాను అలా అడగకపోయినా మద్దతిచ్చిన విషయాన్ని ప్రధాని నివాసం ముందు మీడియాకు కూడా చెప్పారు. ఈ నెలలోనే రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నందున వెళ్లి భేషరతు మద్దతు ప్రకటించి వస్తారని భావిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు. వైఎస్ఆర్‌సీపీ మద్దతు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నిజంగానే కీలకం..మరి జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా లిస్ట్ ప్రధానికి ఇస్తారో లేదో స్పష్టత లేదు. రాజకీయ ప్రయోజనాల విషయంలో మాత్రం ఆయన పరోక్షంగా తన కోరికలు వెల్లడించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close