బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి రేవంత్ ప్రసంగించడంతో బీజేపీ – కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోన్న వేళ వీటన్నింటికి చెక్ పెట్టేలా సంచలన పరిణామం చోటు చేసుకుంది.

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని రేవంత్ కు పంపిన నోటిసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో రేవంత్ వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైజ్ లు వెంట తీసుకురావాలని సూచించారు.

రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ బీజేపీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తాజాగా రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. అయితే, రేవంత్ విచారణకు హాజరు అవుతారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

రేవంత్ రెడ్డి విచారణకు హాజరు అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా..? అని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఐటీ యాక్ట్ కావడంతో అరెస్ట్ వంటి చర్యలు ఏమి ఉండవంటున్నారు నిపుణులు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close