ద‌ర్శ‌కేంద్రుడి ప్రేమ‌లేఖ‌… మ‌రీ కాస్ల్టీ గురూ..!

కె. రాఘ‌వేంద్ర‌రావుది వంద సినిమాల ప్ర‌యాణం. నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం. ఆయ‌న పుస్త‌కం రాశారంటే… అందులో ఏముందో తెలుసుకోవాల‌న్న త‌ప‌న ఉంటుంది. స‌గ‌టు సినీ అభిమానులు, సినిమా పిచ్చోళ్లు.. క‌చ్చితంగా ద‌ర్శ‌కేంద్రుడి పుస్త‌కంపై ఓ లుక్ వేస్తారు. రాఘ‌వేంద్ర‌రావు ఈమ‌ధ్య `నేను సినిమాకి రాసుకొన్న ప్రేమ‌లేఖ‌` అంటూ ఓ పుస్త‌కం రాశారు. ఈ పుస్త‌కం ఇప్పుడు మార్కెట్‌లో ఉంది. అయితే.. ఈ పుస్త‌కం వెల ఎంతో తెలుసా? అక్ష‌రాలా రూ.5 వేలు.

నిజం… ఈ పుస్త‌కానికి 5 వేల ధ‌ర నిర్ణ‌యించారు. ఇంత ఖ‌రీదైన పుస్త‌కం తెలుగు సినీ సాహితీ చ‌రిత్ర‌లోనే లేదేమో..? మ‌రి అంత‌గా అందులో ఏముంది? అనే అనుమానం రావొచ్చు. ఇందులో ఏం లేదు. ఆయ‌న జీవితంలోని కొన్ని సినిమాల గురించీ, కొంత‌మంది వ్య‌క్తుల గురించీ రాసుకొన్నారు. ఇదేం స‌మ‌గ్ర ఆత్మ క‌థ కాదు. కేవ‌లం… విహంగ వీక్ష‌ణంలా సాగిందంతే. పుస్త‌కంలో స‌గం పేజీలు ఫొటోల‌తో నింపేశారు. అవి కూడా త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో క‌నిపించే చిత్రాలే. రాఘ‌వేంద్రుడి పుస్త‌కం కొనుక్కొని, ఆయ‌న జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం అనుకునేవాళ్లంతా దాని రేటు చూసి అవాక్క‌వుతున్నారు. అస‌లే పుస్త‌క ప‌ఠ‌నం బాగా త‌గ్గింది. పైగా సినిమావాళ్ల పుస్త‌కాలంటే.. అందులో పెద్ద‌గా సాహితీ విశేషాలూ, త‌ప్ప‌కుండా తెలుసుకోద‌గ్గ అంశాలూ ఏమీ ఉండ‌వ‌న్న ఓ అప‌వాదు ఉంది. అలాంట‌ప్పుడు రూ.5 వేలు పెట్ట‌డంలో మ‌ర్మ‌మేమిటో? ఇదే రేటు ఉంటే… క‌నీసం 5 పుస్త‌కాలు కూడా అమ్ముడ‌వ్వ‌వు. అన్నీ ఉచితంగా, కాంప్లిమెంట‌రీలుగా స‌మ‌ర్పించుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close