అతి చేసి కేసుల పాలయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు !

రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధిస్తోందంటూ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఆందోళన రివర్స్ అయింది. కొంతమంది నేతల అతి వల్ల ముఖ్య నేతలు కేసుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఈడీ తీరుకు నిరసనగా చలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ ముట్టడించకుండా పోలీసులు ఆపుతారనితెలుసు కాబట్టి కొత్తగా ఆలోచించారు. తెల్లవారుజామునే ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఆ తర్వాత పది గంటల సమయంలో ఇతర నేతలు ముట్టడించారు. దీంతో పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

అది దారి తప్పింది. బారికేడ్లు తప్పించి… మరీ నేతలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఓ మహిళా ఎస్‌ఐని డొక్కలో తన్నడమే కాదు.. మరో ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు. టచ్ చేస్తే స్టేషన్‌కు వచ్చి కొడతానని హెచ్చరించారు. మల్లు భట్టి విక్రమార్క కూడా ఓ డీసీపీ కాలర్ పట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. కాంగ్రెస్ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లుగా లాఠీచార్జ్ చేసిన పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. పలు సెక్షన్ల కిందకేసులు పెట్టారు.

చివరికిరేవంత్ రెడ్డిపై కూడా కేసులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఆందోళనలు అన్ని పార్టీలు చేస్తాయి.. వారిని పోలీసులు స్టేషన్లకు తరలించి వదిలేస్తారు. కేసుల్లాంటివి పెట్టరు. కానీ ఇక్కడ పోలీసులపైనే రుబాబు చూపించడంతో కేసుల పాలవ్వాల్సి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close