నేను సీఎం అయి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు : పవన్

2019లో తాను సీఎం అయి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన తర్వాత జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సరి పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చారు… రైతులకు రూ.2వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు… మొత్తం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసించి.. కక్ష సాధించేందుకే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, దాడి చేయొచ్చు కానీ.. ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారు. వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడని అంటున్నారు. అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు.

పొత్తుల గురించి తాను ఇప్పుడే మాట్లాడబోనని.. తనకు ప్రజలతోనే పొత్తులు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గతంలో ప్రజల కోసమే మోదీ, టీడీపీతో విభేదించాలన్నారు. ప్రజలతో ఎలా ముందుకు వెళ్లాలన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే వెంటనే జాబ్ క్యాలండర్ ప్రకటిస్ామని.. జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని అన్నారు. . పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ప్రతికూల పరిస్థితులే. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గలేదని .. ప్రజల కోసం అనుకున్నది చేస్తాన్నారు.

దసరా తర్వాత నుంచి తాము రోడ్డెక్కుతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దసరా నుంచి పవన్ బస్ యాత్ర ప్రారంభిస్తున్నారు. అప్పట్నుంచి వైసీపీ పాలనపై రోడ్డెక్కి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ సభకు భారీగా జనం తరలి వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close