పాపం సచివాలయ ఉద్యోగులు – జీవితాంతం అదే జీతం..అదే క్యాడర్ !

జగనన్న ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాడని…సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను సైతం వదిలి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగంలో చేరిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. తమ జీవితం దుర్భరమైపోయిందని… మొత్తంగా ఒక్క అడుగుతో నాశనం చేసుకున్నామని బాధపడే పరిస్థితి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇక ముందు ఎలాంటి ప్రమోషన్లు ఉండవు. ఇప్పుడు వారు ఏ పని చేస్తున్నారో.. ఏ క్యాడర్‌లో పని చేస్తున్నారో.. అదే పని..అదే క్యాడర్‌లో రిటైరయ్యే వరకూ ఉండాలి. ఎదుగూబొదుగూ ఉండదు. జీవితంలోనే కాదు.. జీతంలోనూ ఎదుగూబొదుగూ ఉండదు.

ఎందుకంటే క్యాడర్ పెరగనిదే జీతం పెరగదు. ప్రభుత్వాలు ఎప్పుడో దయతలిచి ఇచ్చే పీఆర్సీల ద్వారానే జీతం పెరగాలి. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఈ పీఆర్సీల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విడిగా జీతాల పెంపును నిర్దేశించే ప్రమాదం ముందు ముందు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేయడం వల్ల రూ. పదిహేను వేల నుంచి పాతిక వేలకు జీతం పెరుగుతుంది. అది తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలను ఏమీ వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో విధి నిర్వహణలో మాత్రం ఒత్తిడి విపరీతంగా పెరగనుంది.

ప్రభుత్వ పరంగా ఏ పని చేయాలన్నా భారం వీరిపైనే పడనుంది. అదే సమయంలో వీరు నియామకాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వీరంతా వైసీపీ హయాంలో సరైన ప్రవేశ పరీక్ష లేకుండా నియమితులయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదే ప్రభుత్వం మారితే వీరిపై వివక్ష చూపించే అవకాశం ఉంది. అదే జరిగితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరింత ఇబ్బంది పడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ మంత్రుల పేషీల నుంచి ఒక్క ఫైల్ బయటకు పోకుండా తాళాలు !

తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మంత్రుల కార్యాలయాల నుంచి కీలక ఫైళ్లు వాహనాల్లో తీసుకెళ్లిన విషయం గగ్గోలు రేగింది. ఏపీలో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ...

చిహ్నంలో భాగ్యలక్ష్మి టెంపుల్… బండి ట్వీట్ సారాంశం ఇదేనా..?

తెలంగాణ అధికారిక చిహ్నం మార్పును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా బీజేపీ ఎలాంటి వైఖరిని ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతుంటే బీజేపీ మాత్రం మౌనం...

డేరాబాబా నిర్దోషి – అన్యాయంగా జైల్లో పెట్టేశారా !?

డేరాబాబా గురించి కథలు కథలుగా దేశమంతా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిర్దోషి అని హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. తన మాజదీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో...

సజ్జల అల్లర్ల హింట్ – మీనా అరెస్టుల వార్నింగ్

కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి రేపతామని వైసీపీ నేతలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఖచ్చితంగా ఘర్షణ జరుగుతుందని పేర్ని నాని ముందే హెచ్చరించారు. పోలింగ్ ఏజెంట్లకు సజ్జల కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close